జగిత్యాల : జగిత్యాల పట్టణ పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడిగా, రంగస్థల నటుడిగా, హిందీ మాస్టర్గా దివంగత మచ్చ గంగారాం అందించిన సేవలు మరువలేనివని వక్తలు కొనియాడారు.
శనివారం మచ్చగంగారాం సంతాప సమావేశం స్థానికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశాలి అఫిషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (పోపా) నాయకులు ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పోపా జిల్లా అధ్యక్షుడు ఏవీఎన్. రాజు, కార్యదర్శి ప్రధాన కార్యదర్శి కొక్కుల రాజేష్, పట్టణ అధ్యక్షుడు ఎలిగేటి రాజేంద్ర ప్రసాద్, ప్రధాన కార్యదర్శి దండె గోవర్ధన్, ఆలిశెట్టి దయాకర్, మచ్చ శ్రీనివాస్, మచ్చ రాజశేఖర్, వడ్డేపల్లి శ్రీనివాస్, పద్మశాలి సేవా సంఘము అధ్యక్షుడు వొల్లాల గంగాధర్, కార్యదర్శి బోగ గంగాధర్, పూర్వ విద్యార్థులు, కుల బాంధవులు పాల్గొన్నారు.