మహదేవపూర్(కాటారం), జూలై 25: పెండింగ్ బిల్లుల కోసం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మాజీ ఉపసర్పంచ్, కాంగ్రెస్ నాయకుడు నాయిని శ్రీనివాస్ ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్ర కారం.. కాటారం ఉపసర్పంచ్, ఇన్చార్జి సర్పంచ్గా పనిచేసిన శ్రీనివాస్ గ్రామం లో డ్రైనేజీలు, బోర్ మోటర్ తదితర అ భివృద్ధి పనులు చేపట్టారు.
ఈ పనులకు సంబంధించి రూ.11 లక్షల బిల్లులు పెం డింగ్లో ఉన్నాయి. అధికారుల చుట్టూ తిరిగినా బిల్లు రాకపోవడంతో మనస్తాపానికి గురై శనివారం పురుగులమందు తాగాడు. వెంటనే కుటుంబసభ్యులు ఆ యనను భూపాలపల్లిలోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు.