మానకొండూర్ రూరల్, ఏప్రిల్ 10: రంగపేట, లలితాపూర్, అన్నారం గ్రామాల్లోని ఆలయాల్లో నిర్వహించిన వేడుకలకు రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు శాలువాలతో సన్మానించారు. కొండపల్కల, గంగిపల్లి, ముంజంపల్లి, చెంజర్ల తదితర గ్రామాల్లోని ఆలయాల్లో వేడుకలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమాల్లో జడ్పీటీసీ శేఖర్గౌడ్, సర్పంచులు బొట్ల కిషన్, మర్రి కొండయ్య, నాయకులు ముద్దసాని శ్రీనివాస్రెడ్డి, రుద్రవరం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అన్నారంలోని ఆలయంలో నిర్వహించిన వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ పాల్లొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మోహన్ను సర్పంచ్ బొట్ల కిషన్, ఆలయ కమిటీ సభ్యులు శాలువాలతో సన్మానించారు. వీరి వెంట అట్ల గట్టయ్య, రాజయ్య, పురుషోత్తంరెడ్డి, ఆరెల్లి సంపత్ తదితరులున్నారు.
చిగురుమామిడి మండలంలో..
చిగురుమామిడి, రేకొండ, ములనూరు, సీతారాంపూర్, సుందరగిరి, ఇందుర్తి, నవాబ్పేట్ తదితర గ్రామాల్లోని ఆలయాల్లో సీతారాముల కల్యాణ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. చిగురుమామిడిలో ఎంపీపీ కొత్త వినీత-శ్రీనివాస్రెడ్డి దంపతులు, సుందరగిరిలో ఆలయ కమిటీ చైర్మన్ తాళ్లపల్లి సంపత్ గౌడ్, సర్పంచ్ శ్రీమూర్తి రమేశ్, రేకొండలో ఆలయ కమిటీ చైర్మన్ పిట్టల అంజయ్య, సర్పంచ్ రజిత-శ్రీనివాస్ దంపతులు, విండో డైరెక్టర్ చాడ శ్రీధర్రెడ్డి-కవిత దంపతులు, గాగిరెడ్డిపల్లెలో సర్పంచ్ సన్నీళ్ల వెంకటేశం, నవాబ్ పేటలో సుద్దాల ప్రవీణ్, ఉల్లంపల్లిలో సర్పంచ్ చెప్యాల మమత-శ్రీనివాస్ దంపతులు పాల్గొన్నారు. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.
గన్నేరువరం మండలంలో..
మండల కేంద్రంతోపాటు ఖాసీంపేట, మైలారం, మాదాపూర్, గుండ్లపల్లి, గునుకులకొండాపూర్ తదితర గ్రామాల్లోని ఆలయాల్లో సీతారాముల కల్యాణోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సర్పంచులు, ఎంపీటీసీలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
శంకరపట్నం మండలంలో..
కేశవపట్నం, ఎరడపల్లి, కన్నాపూర్, మొలంగూర్, రాజాపూర్, లింగాపూర్, కాచాపూర్, మెట్పల్లి, తాడికల్, కరీంపేట్ తదితర గ్రామాల్లోని ఆలయాల్లో సీతారాముల కల్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. భక్తులు అధికసంఖ్యలో హాజరు కాగా, తీర్థప్రసాదాలు అందజేశారు. పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. కొత్తగట్టు, కాచాపూర్ ఆలయాల్లో జరిగిన వేడుకలకు ఎంపీపీ ఉమ్మెంతల సరోజన, జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాస్రెడ్డి హాజరయ్యారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచులు వెంకటరమణారెడ్డి, రాజయ్య, స్వప్న, రంజిత్రావు, సరోజన, సుజాత, నాయకులు తనుకు ఓంకారం, ప్రభాకర్, మహేందర్, బాబన్న, నాగభూషణం, తిరుపతయ్య, శంకరానందం తదితరులున్నారు.
తిమ్మాపూర్ మండలంలో..
రేణికుంట లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించిన వేడుకల్లో అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్ సతీసమేతంగా హాజరయ్యారు. ఏఎంసీ చైర్పర్సన్ అనిత, వైస్ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి పా ల్గొన్నారు. ఎంపీపీ కేతిరెడ్డి వనిత-దేవేందర్రెడ్డి తిమ్మాపూర్లో నిర్వహించిన కల్యాణ వేడుకలకు హాజరయ్యారు. ఎల్ఎండీలోని తాపాల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిర్వహించిన వేడుకల్లో అమ్ము స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు డాక్టర్ సుజాత-వెంకట్రెడ్డి కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు. గొల్లపల్లిలో నిర్వహించిన వేడుకల్లో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రావుల రమేశ్, వైస్ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి, సర్పంచ్ మల్లెత్తుల అంజయ్య, నరేందర్రెడ్డి పాల్గొన్నారు.