జగిత్యాల : జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మంగళవారం ఉదయం జాగింగ్ చేస్తూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జగిత్యాల పట్టణంలోని చింతకుంట మినీ ట్యాంక్ బండ్ను సందర్శించి వాకర్లతో కలిసి వాకింగ్ చేస్తూ ముచ్చటించారు.
మినీ టాంక్ బండ్ వల్ల వాకింగ్ జిమ్ సౌలభ్యం ఏర్పడ్డాయని, గతంలో వేరే చోట్లకు వెళ్లి వాకింగ్ చేసే పరిస్థితి ఉండేదని వాకర్స్ ఎమ్మెల్యేకు తెలిపారు.
అలాగే మహిళలు సైతం అధిక సంఖ్యలో వస్తున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కాసేపు ఓపెన్ జిమ్లో వ్యాయామం చేసిన ఎమ్మెల్యే మినీ టాంక్ బండ్ పరిసరాల్లో శానిటేషన్ కొనసాగించాలని, ఆహ్లాదంగా ఉండేలా చూడాలని కమిషనర్ను ఆదేశించారు.
ఎమ్మెల్యే వెంట కౌన్సిలర్ పంబాల రాము, నాయకులు బాలే శంకర్, మేక పవన్, మ్యాకల పవన్, క్రాంతి, వాకర్ అసోసియేషన్ సభ్యులు, కమిషనర్ స్వరూప రాణి, తదితరులు ఉన్నారు.