బోయినపల్లి, నవంబర్ 24: పేదల అభ్యున్నతే సీఎం కేసీఆర్ లక్ష్యమని, ఆ దిశగా అమ లు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పేదిం టి ఆడపిల్లలకు అండగా నిలుస్తున్నాయని ఎమ్మె ల్యే రవిశంకర్ స్పష్టం చేశారు. బోయినపల్లి మం డల పరిషత్ కార్యాలయ ఆవరణలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన 60 మందికి గురువారం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కలను అందజేసి మాట్లాడారు. ప్రభుత్వం అమ లు చేస్తున్న కల్యాణ లక్ష్మి పథకంతో బాల్య వివాహలు పూర్తిగా నిలిచిపోయాయని చెప్పారు. ఈ పథకాన్ని అమలు చేస్తున్న దేశంలోనే ఏకైక రా ష్ట్రం తెలంగాణ మాత్రమేనని చెప్పారు. ఈ పథ కం కింద రూ.10 వేల కోట్ల ఆర్థిక సాయం చేసి న ప్రభుత్వం భారత దేశంలో ఎక్కడా లేదన్నా రు. అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్న తెలంగా ణ వైపు అన్ని దేశాలు చూస్తున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, తహసీల్దార్ నరేశ్, ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ముదుగంటి సురేందర్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ లెంకల సత్యనారాయణరెడ్డి, మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు కొనుకటి లచ్చిరెడ్డి, వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండలాధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య, సర్పంచులు చిందంరమేశ్, ఇల్లందుల శంకర్, బూర్గుల నందయ్య, కన్నం మధు, ఎంపీటీసీ ఉపేందర్, కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ అజ్జు, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
ఒకే ఇంటికి రెండు చెక్కులు
బోయినపల్లికి చెందిన పెగ్గెర్ల లక్ష్మికి ఇద్దరు కూతుళ్లు రవళి, శిరీష. వారికి కొద్ది రోజుల కిందట పెండ్లి చేసింది. తర్వాత కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేయ గా, ఒక్కొక్కరికి లక్షా116 చొప్పున రెండు చెక్కు లు మంజూరయ్యాయి. వీటిని గురువారం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అందజేశారు.