మెట్పల్లి, నవంబర్ 24: మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నానని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు పేర్కొన్నారు. మార్కెట్ యార్డు ఆవరణలో, జాతీ య రహదారి పక్కన రూ.2.95 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వ్యాపార దుకాణ సముదాయ భవనం, మార్కెట్ కమిటీ నూతన కార్యాలయ భవన నిర్మాణ పనులకు సంబంధించి గురువా రం ఎమ్మెల్యే శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, పంటల ఉత్పత్తుల క్రయ, విక్రయాలతో పాటు రైతులకు సేవలందించడం కోసం మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ల అభివృద్ధికి నిధుల కేటాయింపులో సముచిత ప్రాధాన్యం కల్పిస్తున్నదని, ఇక్కడ వ్యాపార దుకాణ సముదాయ భవనం, నూతన కార్యాలయం భవన నిర్మాణం కోసం రూ.2.95 కోట్లు కేటాయించిందన్నారు.
అనంతరం జాడు, హమాలీ, దడువాయి కార్మికులకు మార్కెటింగ్ శాఖ తరపున కొత్త బట్టలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను మార్కెటింగ్ శాఖ అధికారులు, వ్యాపారులు శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షురాలు రాణవేని సుజాత, ఎంపీపీ మారు సాయిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ తీగల లింగారెడ్డి, మున్సిపల్ వైస్చైర్మన్ చంద్రశేఖర్రావు, కౌన్సిలర్లు కిశోర్, సహదేవ్, పురుషోత్తం, లంక గంగాధర్, ఒజ్జెల బుచ్చిరెడ్డి, మన్నేఖాన్, మార్కెటింగ్ శాఖ డీఎం ప్రకాశ్, డీఈ మునిందర్, మార్కెట్ కమిటీ ఇన్చార్జి కార్యదర్శి రమణ, మాజీ వైస్ చైర్మన్ పూదరి సుధాకర్ గౌడ్, నాయకులు గుంటుక విష్ణు, మహాజన్ నర్సింహులు, తాటికొండ వినోద్, రాయల్ నాయక్ పాల్గొన్నారు.
టీ(బీ)ఆర్ఎస్ కార్యాలయ పరిశీలన
టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గురువారం పరిశీలించారు. జిల్లాలో డిసెంబర్ 7న ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించి కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించనేపథ్యంలో ఎమ్మెల్యే పార్టీ కార్యాలయంలో చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.