రామడుగు, ఏప్రిల్ 9: ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని తహసీల్దార్ కోమల్రెడ్డి, ఎంపీడీవో ఎన్నార్ మల్హోత్రా సూచించారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం వారు వైద్యాధికారులు శ్రీనివాస్, బీ శ్రీనివాస్గౌడ్, ఆరోగ్య సిబ్బందితో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలో కరోనా టాస్క్ఫోర్స్ బృందం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్, ఎంపీడీవో మాట్లాడుతూ, 45 ఏళ్లు నిండిన వారికి కొవిడ్ టీకా వేయించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి గ్రామాల్లో అవగాహన సదస్సులు, పోస్టర్ల ద్వారా ప్రచారం చేస్తామని పేర్కొన్నారు. ప్రజలు మాస్కు ధరించకుంటే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. కాగా, సెలవు రోజుల్లో కూడా పంచాయతీ రాజ్ సిబ్బంది విధులు నిర్వహిస్తారని ఎంపీడీవో తెలిపారు.
కరోనా నియంత్రణకు కృషి చేయాలి
చొప్పదండి, ఏప్రిల్ 9: మండలంలో కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంపీపీ చిలుక రవీందర్ సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో కరోనా నియంత్రణపై మండలస్థాయి అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి గ్రామంలో కరోనా జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలు మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని, చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలన్నారు. ఉపాధి హామీ పని స్థలాల్లో కూలీలు భౌతిక దూరం పాటించేలా చూడాలని, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ప్రథమ చికిత్స పెట్టెలు అందుబాటులో ఉంచాలని సిబ్బందికి సూచించారు. తహసీల్దార్ రజిత, ఎంపీడీవో స్వరూపారాణి, వైద్యాధికారి రమాదేవి, ఎస్ఐ వంశీకృష్ణ, సూపరింటెండెంట్ వేణుగోపాల్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
కరోనా+పెట్రో రేట్లు.. టూ వీలర్స్ సేల్స్ డౌన్..
షాక్: భారీగా తగ్గిన చమురు యూసేజ్.. 1999 తర్వాత..