జగిత్యాల : శ్రావణమాసం సందర్భంగా జగిత్యాలలో (Jagtial)ని కొండగట్టు (Kondagattu ) శ్రీ ఆంజనేయస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. శనివారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంతాలు రద్దీగా మారాయి. శ్రావణ మాసం పురస్కరించుకొని ఆలయ ప్రకార మండపములో సత్యనారాయణ వ్రతాలు, అష్టోత్తర శతనామవాలి పూజ, ఆంజనేయ స్వామివారి కి ప్రత్యేక అభిషేకం తదితర పూజ కార్యక్రమాలను నిర్వహించారు.
ప్రధాన ఆలయంలో ఆంజనేయ స్వామితో పాటు, లక్ష్మీ, వేంకటేశ్వరస్వామిని భక్తులు దర్శించుకున్నారు. అనుబంధ ఆలయాలుభేతాల స్వామి, మునిగుహలు, కోదండ రామాలయం, సీతమ్మ కన్నేటిధార,బొజ్జ పోతన, కొండల రాయుడి పాదుకల ముద్రలు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
శనివారం స్వామివారిని సుమారు 30 వేల భక్తులు దర్శించుకున్నారని ఆలయ అధికారులు వెల్లడించారు. భక్తుల (Devotees) రద్దీని దృష్టిలో పెట్టుకుని కొండపైన ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నామని ఆలయ ఏఈవో (AEO) బుద్ది శ్రీనివాస్ తెలిపారు.