Jagtial |జగిత్యాల జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు అయింది. ఈనెల 25న షార్జా నుంచి జిల్లాలోని మెట్పల్లికి వచ్చిన ఒకరికి ఒమిక్రాన్ నిర్దారణ అయినట్టు అధికారులు తెలిపారు. ఒమిక్రాన్ సోకిన వ్యక్తిని వెంటనే హైదరాబాద్ టిమ్స్కు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. తను ఆసుపత్రికి వెళ్లేందుకు నిరాకరిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.
ఈనెల 25న ఆ వ్యక్తి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో శాంపిల్స్ ఇచ్చాడు. జీనోమ్ సీక్వెన్స్కు శాంపిల్స్ పంపించగా.. అది ఒమిక్రాన్ వేరియంట్గా నిర్దారణ అయింది. మెట్పల్లికి వచ్చిన తర్వాత అతడు గత మూడు రోజుల నుంచి పలు ప్రాంతాల్లో తిరిగినట్టు స్థానికులు చెబుతున్నారు.