జగిత్యాల : ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం పట్ల ఫీల్డ్ అసిస్టెంట్లు హర్షం వ్యక్తం చేశారు. సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ని శుక్రవారం ధర్మపురి నియోజకవర్గంలోని ఫీల్డ్ అసిస్టెంట్లు కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో కలిసి మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తామని తెలిపారు. అలాగే తమని తిరిగి విధుల్లోకి తీసుకుంటామని ప్రకటించిన సీఎం కేసీఆర్కు కూడా కృతజ్ఞతలు తెలిపారు.