జగిత్యాల : ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని జిల్లా కలెక్టర్ జి. రవి అధికారులను ఆదేశించారు. గురువారం బుగ్గారం మండలం లోని యశ్వంతరావు పేట, గోపాలపురం, వెల్గటూర్ మండలంలోని కిషన్రావుపేట, ఎండపల్లి గ్రామలలో ఏర్పాటుచేసిన ఐకేపీ సెంటర్లు, బుగ్గారం మండలం మద్దునూరు, సిరికొండ, ధర్మపురి మండలం తిమ్మాపూర్, నెరేళ్ల గ్రామలలో ఏర్పాటు చేసిన పీఏసీఎస్ కేంద్రాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ధర్మపురి ఏఎంసీ సెంటర్లలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలులో వేగం పెంచాలని సెంటర్ ఇంచార్జీలను కలెక్టర్ ఆదేశించారు.