జగిత్యాల : విద్యుత్ షాక్తో ఓ రైతు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన మెట్పల్లి మండలం మెట్లచిట్టాపూర్లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..మెట్లచిట్టాపూర్ గ్రామానికి చెందిన పుర్రె లింగం(60) పొలం పనులకు ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. కాగా, మార్గమధ్యలో తెగిపడిన విద్యుత్ తీగలకు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.