కోరుట్ల : కోరుట్లలో కమలం పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన చెందిన ముఖ్య నాయకులు ఎమ్మెల్సీ కవిత సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. బీజేపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు, టౌన్ అధ్యక్షుడితో పాటు దాదాపు 200 మంది నాయకులు పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరారు. కోరుట్ల టౌన్ అధ్యక్షుడు దాసరి రాజశేఖర్, 11వ వార్డు కౌన్సిలర్ దాసరి సునిత, 12వ వార్డు కౌన్సిలర్ అలేఖ్య, ఆమె భర్త మురళీ గులాబీ కండువా కప్పుకున్నారు.
బీజేవైఎం మెట్పల్లి టౌన్ అధ్యక్షుడు పసునూరి ఆనంద్, యూసఫ్ నగర్ మాజీ సర్పంచులు శంకర్, రాజు, వార్డు సభ్యుడు జాఫర్ తో పాటు వారి వెంట దాదాపు 200 మంది యువకులు చేరారు. నియోజకవర్గంలో బీజేపీకి ముఖ్యమైన నాయకులు బీఆర్ఎస్ లో చేరడంతో ఆ పార్టీకి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. కోరుట్ల, మెట్పల్లి టౌన్లతో పాటు పరిసర గ్రామాల్లో రాజకీయంగా పట్టు ఉన్న నాయకులు బీఆర్ఎస్ చేరడం బీజేపీకి కోలుకోలేని దెబ్బతగిలింది .