సిరిసిల్ల రూరల్, డిసెంబర్ 2: కుటుంబ కలహాలకు ఓ నిండు ప్రాణం బలైపో యింది. తొడబుట్టిన అక్కను కత్తితో పొడిచి కడతేర్చాడు ఓ ప్రబుద్ధుడు. రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం పద్మనగర్లో శుక్రవారం రాత్రి ఈ ఘోరం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప ద్మనగర్కు చెందిన గజవెల్లి యాదగిరి- బూదవ్వ దంపతులకు ఇద్దరు కూతుర్లు,కొడుకు. ఇద్దరు కూతుర్ల పెండ్లిళ్లు జరిగాయి. కొడుకు శివరామరాజు(30)కు వివాహం కాలేదు.
పెద్దకూతురు గాలి కవిత (45) భర్తతో విడిపోయి, ఐదేళ్ల క్రితం పద్మనగర్కు వచ్చి అద్దె ఇంటిలో ఇద్దరి కూతుర్లతో కలిసి ఉంటున్నది. ఇటీవలే పెద్ద కూతురు వివా హం జరిపించింది. ఆమె తమ్ముడు శివరా మరా జు టెక్స్టైల్ పార్క్లో మరమగ్గాలు నడుపుతుంటాడు. శివరామరాజు, తండ్రి యాదగిరికి మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో తమ్ము డికి పలు మార్లు కవిత సర్దిచెప్పింది. ఇది గిట్టని తమ్ముడు శివరామరాజు శుక్రవారం అక్క ఉంటున్న అద్దె ఇంటికి వెళ్లి గొడవపడ్డాడు. ఈ సమయంలో కవిత కూతుర్లు అమ్మ మ్మ ఇంట్లో ఉన్నారు. ఒంటరిగా ఉన్న అక్కతో తమ్ముడు వాగ్వాదానికి దిగాడు. మాటమాట పెరిగి ఒక్కసారిగా వెంట తెచ్చుకున్న కత్తితో అక్క కడుపులో విచక్షణ రహితంగా పొడిచాడు. తీవ్రం గా గాయపడ్డ కవిత అక్కడిక్కడే మృతి చెందింది. గమనించిన స్థానికులు అక్కడికి చేరుకొనేలోపే శివరామరాజు అక్కడి నుంచి పారిపో యాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సిరిసిల్ల డీఎస్పీ విశ్వప్రసాద్, సీఐ ఉపేందర్,ఎస్ఐ లక్ష్మారెడ్డి ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నామని సిరిసిల్ల డీఎస్పీ విశ్వప్రసాద్ తెలిపారు.