మంథని, ఫిబ్రవరి 26: నాగర్కర్నూల్ జిల్లాలో కుల వివక్ష రెండు నెలల పసిగుడ్డు ప్రాణాలు తీసిందని, ఈ ఘటన అత్యంత బాధాకరమని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ విచారం వ్యక్తం చేశారు. దైవ దర్శనానికి వెళ్లిన రజక సామాజిక వర్గానికి చెందిన కుటుంబంపై దాడి చేసి పసిపాప మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం మంథనిలోని జ్యోతిబా పూలే విగ్రహం నుంచి అంబేదర్చౌరస్తా మీదుగా ఆర్డీవో కార్యాలయం దాకా మూతికి నల్లగుడ్డ కట్టుకొని బీఆర్ఎస్ నాయకులతో కలిసి మౌన ర్యాలీ తీశారు.
అనంతరం ఆర్డీవో సురేశ్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మధూకర్ మాట్లాడుతూ, పాప మృతి ఘటన గురించి వింటేనే మనం ఏ కాలంలో ఉన్నామో తెలియడం లేదన్నారు. కులాలను పుట్టించిన కాంగ్రెస్ పార్టీ, ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మనుషుల మధ్య వైషమ్యాలను సృష్టించి అవమానపర్చడం సాధారణమైందన్నారు. తాజాగా నల్గొండ జిల్లాలో రాజేశ్ అనే యువకుడు లాకప్ డెత్లో చనిపోతే, అకడ ఎస్హెచ్వోగా ఉన్న ఓసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని రక్షిస్తూ ఘటనకు బీసీ సామాజిక వర్గానికి చెందిన సీఐని బాధ్యుడిని చేస్తూ సస్పెండ్ చేశారని మండిప డ్డారు.
హోం శాఖను తన దగ్గర పెట్టుకున్న సీఎం రేవంత్రెడ్డి ఈ ఘటనపై స్పందించకపోవడం బాధాకరమన్నారు. రాజ్యాంగం పట్టుకుని దేశమంతా తిరుగుతున్న రాహుల్గాంధీ ఇలాంటి ఘటనలపై స్పందించాలని హితవు పలికారు. ఇక్కడ భూపాలపల్లి జడ్పీ మాజీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి, బీఆర్ఎస్ నాయకులు జక్కు రాకేశ్, కౌన్సిలర్ మాచీడి రాజుగౌడ్, విలోచవరం సర్పంచ్ కొండా రవీందర్, నాయకులు ఎగోలపు శంకర్గౌడ్, కాయితీ సమ్మయ్య, తిరుపతి, హరీశ్, ఆసీఫ్, ఇర్ఫాన్ పాల్గొన్నారు.