ఎలాంటి సంపాదన లేక బాధపడుతున్న నాకు పెన్షన్ పెంచి ముఖ్యమంత్రి బతుకు చూపిండు. మన రాష్ట్రం రాకముందు మమ్ములను పట్టించుకున్నోళ్లు లేరు. ఎలక్షన్ల మాఇంటి కొచ్చి మమ్ములను తీసుకపోయి కాంగ్రెస్, టీడీపొల్లు ఓట్లేయించుకునేటోళ్లు. తర్వాత ఏ సాయమడిగినా చేసెటోళ్లు కాదు. కేసీఆర్ సీఎం అయినంక మేమడగక ముందే మా పరిస్థితి మారింది. ఎమ్మెల్యే సార్ పింఛన్ రాయించిండు. అప్పటి నుంచి నెల నెలా వస్తున్న పెన్షన్ అందుకుంటున్న, ఇప్పుడు ముఖ్యమంత్రి మరో వెయ్యి పెంచి మా కుటుంబానికి ఆదరువు చూపిండు. మమ్ములను పదిమందితో సమానంగా చూసేలా చేస్తున్నడు. ఆయన చేస్తున్న సాయానికి మాకుటుంబం ఎంతో రుణపడి ఉంటది.
– దావ వనిత, ఆసిఫ్నగర్
దివ్యాంగులకు రాష్ట్ర సర్కారు కొండంత ధైర్యాన్నిస్తున్నది. పెరిగిన అవసరాలకు తగ్గట్టుగా పింఛన్ను మరో రూ.వెయ్యి పెంచిన సర్కారు, నాలుగురోజులుగా రూ.4,016 ఖాతాల్లో జమ చేస్తుండడంతో వారిలో ఆనందం ఉప్పొంగుతున్నది. ఎప్పటికప్పుడు ప్రొసీడింగ్లు అందిస్తూ, వచ్చినవి వచ్చినట్లే యంత్రాంగం క్రెడిట్ చేస్తుండడంతో లబ్ధిదారులు సంబురపడుతున్నారు. మనసున్న మారాజు సీఎం కేసీఆర్ అని, మళ్లీ ఆయనే ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ, కృతజ్ఞతలు చాటుతున్నారు.
కలెక్టరేట్, ఆగస్టు 26: సామాజికంగా, కుటుం బ పరంగా అసమానతలు ఎదుర్కొంటూ, అనేక అ వమానాలు, ఛీత్కారాలకు గురవుతున్న ది వ్యాం గులకు రాష్ట్ర సర్కారు అండగా నిలిచింది. పింఛన్ పెంచుతూ భరోసా కల్పించింది. ఈ మేరకు ఇటీవలే సీఎం కేసీఆర్ ప్రకటన చేయగా, నాలుగు రోజులుగా పెరిగిన పెన్షన్ మొత్తాన్ని అధికారులు బ్యాంకు ఖాతాల్లో జమచేస్తుండగా, దివ్యాంగుల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. శనివారం జిల్లాలోని కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను మంత్రి గంగుల కమలాకర్ అందజేయగా మురిసిపోయారు. ముఖ్యమంత్రి కేసీఆర్ను వేనోళ్లలా పొగుడుతూ, పది కాలాల పాటు రాష్ట్రంలో ఆయన పాలనే కొనసాగాలంటూ దీవిస్తున్నారు.
జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాలకులు దివ్యాంగులను పట్టించుకున్న పాపాన పోలే. తూతూమంత్రం గా పింఛన్ ఇచ్చి, చేతులు దు లుపుకునేటోళ్లు. ఉద్యమంలో మేం కూడా పా ల్గొన్నం. మా బాధలు, ఇబ్బందులు చూసిన సీఎం రూ.2016 పెన్షన్ ఇచ్చిండు. తర్వాత సాలుతలెవ్వంటే మరో వెయ్యి పెంచిండు. ఇపుడు ధ రలు పెరిగినయ్. మేమెట్ల బతుకాలంటే ఇంకో వె య్యి పెంచి, రూ.4016 ఇస్తండు. ఈ మొత్తంతో మా కుటుంబాలు నెలదాకా ఎలాంటి బాదరాబందీ లేకుండా జీవనం సాగిస్తున్నయ్. మాకు ఇంతకన్నా ఇంకేం కావాలే. మాజీవితాల్లో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
– ఇజ్జగిరి రాములు, చెర్ల బూత్కూర్
మా ఇంటి దేవుడిగా మారిండు
అంగవైకల్యంతో పనులు చేతకాక బతుకు కష్టమై, కుటుంబానికి భారంగా మారిన మాకు పెన్షన్ పెంచి సీఎం కేసీఆర్ మా ఇంటి దేవుడిగా మారిండు. పెరిగిన పింఛన్ మాకుఆసరాగా మారింది. నా పేర వస్తున్న పింఛన్ మా ఇంటి వాళ్లు సంపాదించే దానితో సమానమైంది. ఈ మొత్తంతో కుటుంబ పోషణతో పాటు మా పిల్లల చదువులు కూడా సజావుగా సాగుతాయని సం తోషపడుతున్న. గతంలో ఎందరో మంది ము ఖ్యమంత్రులు పనిచేసినా, కేసీఆర్ సారు లెక్క మాపట్ల ఎవరూ దయ చూపలేదు. నేను, నాకుటుంబంతో పాటు నా బంధు, మిత్రులను కూడా కేసీఆర్ వెంటే నడిచేలా కోరుతా. ఆయనలాంటి ముఖ్యమంత్రితోనే మాలాంటి పేదలకు న్యాయం జరుగుతది. నాకన్నా ఇంకా వెనుకబడిన వారు ఎందరో ఉన్నరు. వారందరికీ నా లాగే న్యాయం జరగాలంటే మరోసారి సీఎంగా కేసీఆరే ఉండాలే.
– మునిగంటి ఎల్లయ్య, చామనపల్లి
కుటుంబావసరాలు తీరుతున్నయ్..
రెక్కాడితే కానీ డొక్కాడని మా కుటుంబంలో నా భార్య సంపాదనతోనే పూట గడిచేది. పిల్లల చ దువులు, నా వైద్య ఖర్చులకు అప్పులు చేసేది. సీఎం కేసీఆర్ దయతో పె రిగిన పె న్షన్తో కుటుంబావసరాలు తీరుతున్న య్. ప్రతి నెలా నా వైద్య ఖర్చులతో పాటు పిల్లల చదువులకు కూడా పెన్షన్తోని వచ్చే మొత్తం సరిపోతుంది. నాటి కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల హా యాంలో నాకు ఏనాడూ పెన్షన్ రాలేదు. నన్ను ఎ వరూ పట్టించుకోలే. నాయకుల చుట్టూ తిరిగి, తిరిగి విసిగిపోయిన. కొత్త రాష్ట్రంల నేను అడగకముందే ఎమ్మెల్యే కమలాకర్ సార్ వచ్చి నాకు పెన్ష న్ పెట్టిచ్చిండు. మా బాధలు చూసిన ముఖ్యమం త్రి రెండు వేల పెన్షన్ మూడు వేలు చేసిండు. ఇపు డు నాలుగు వేలు చేసిండు. ఆయన చేసిన మేలు నేను, నాకుటుంబం ఈ జన్మలో మర్చిపోలేం. మేం బతికినన్నాళ్లూ ముఖ్యమంత్రి కేసీఆర్కు మద్దతుగా ఉంటాం. ఆయన వెనుకనే నడుస్తాం.
– తుమ్మ రాజ్కుమార్, చామనపల్లి
మాకు ఆధారం చూపిండు..
నేను వికలాంగుడిని కావడంతో మా ఇంట్ల మా భార్య సంపాదనతోనే బతుకు వెళ్లదీయాల్సి వచ్చేది. నాకచ్చే పెన్షన్ మొత్తం నాకయ్యే మం దు, గోళీలకే సరిపోయేది. పెరిగిన పెన్షన్తో ఇపుడు నేను కూడా నా భార్యతో సమానంగా సంపాదించినట్లయితంది. గవర్నమెంటు దవాఖానలో ఇచ్చే గోళీలతో ఆరోగ్యం కు దుటపడుతుంది. గృహలక్ష్మి పథకంల కూడా ము ఖ్యమంత్రి కేసీఆర్ మాకు ఐదు శాతం రిజర్వేషన్ ప్రకటించిండు. ఇంతకుముందు ఎవ్వ లు కూడా మమ్ములను పట్టించుకోలేదు. ఏ పని చేసుకోలేని స్థితిలో ఉన్న నాకు పెరిగిన పెన్షన్ ధీమాను ఇచ్చిం ది. కూలీ, కైకిలి చేసుకున్నా బతుకలేని స్థితిలో ఉన్న మా కుటుంబానికి కేసీఆర్ అన్నం పెట్టిన దేవుడిగా మారాడు. ఆయనను బతికినంత కాలం తలుచుకుంటాం. వచ్చే ఎన్నికల్లో ఆయన పార్టీకి అండగా నిలుస్తాం.
– ఎం.కుమార్, బహుదూర్ఖాన్పేట