తెలంగాణచౌక్, ఆగస్టు 31 : రాఖీ పండుగ సందర్భంగా టీఎస్ ఆర్టీసీ కరీంనగర్ రీజియన్ పరిధిలో గురువారం ఒక్క రోజు రూ.2 కోట్ల 6 లక్షల 67 వేల ఆదాయం లభించింది. పండుగ రద్దీ దృష్ట్యా రీజియన్ పరిధిలో గత నెల 30 నుంచి ఈ నెల 4 వరకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. అంతే కాకుండా, లక్కీ డ్రా బహుమతులు ప్రకటించడంతో ప్రయాణికల సంఖ్య పెరిగింది. వరంగల్, గోదావరిఖని, హుజూరాబాద్, కోరుట్ల, సిరిసిల్ల, వేమువాడ రూట్లల్లో అధిక సంఖ్యలో ప్రయాణించారు. సాధారణంగా ప్రతి రోజూ 2.50 లక్షల మంది జిల్లా కేంద్రానికి ప్రయాణిస్తారు. కానీ, రాఖీ పండుగ సందర్భంగా గురువారం ఒక్క రోజే 3.50 లక్షల మంది ప్రయాణించినట్లు ఆర్ఎం సుచరిత తెలిపారు.
బుధవారం 3.80 లక్షల కిలో మీటర్లు బస్సులు నడిపించగా.రూ 2.8 కోట్ల ఆదాయం సమకూరింది. బుధవారం 11 డిపోల నుంచి వచ్చిన ఆదాయం వివరాలిలా ఉన్నాయి. గోదావరిఖని రూ.31.71 లక్షలు, హుస్నాబాద్ రూరల్ రూ.8.76 లక్షలు, హుజూరాబాద్ రూ.15.3 లక్షలు, కరీంనగర్-1 రూ.24.94లక్షలు, కరీంనగర్ -2 రూ.27.29 లక్షలు, మంథని రూ.12.15 లక్షలు, జగిత్యాల రూ.29.24 లక్షలు, కోరుట్ల రూ.15.14 లక్షలు, మెట్పల్లి 19.09 లక్షలు, సిరిసిల్ల రూ.13.54 లక్షలు, వేములవాడ రూ.15.78 లక్షలు గడించినట్లు ఆర్ఎం తెలిపారు.