గొల్లపల్లి, ఆగస్టు 18: దళితుల, మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేశామని, అర్హులందరికీ ద ళితబంధు అందజేస్తామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. అన్ని విధాలా అండగా నిలుస్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం గొ ల్లపల్లి మండలంలో పర్యటించారు. మండలంలోని బొంకూర్లో 5 లక్షలతో నిర్మించిన యాదవ కమ్యూనిటీ హాల్ను, చిల్వకోడూర్లో కోటి 68లక్షలతో నిర్మించిన చెక్డ్యాం, 20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం, 20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, 10 లక్షలతో నిర్మించిన కబ్రస్తాన్ ప్రహారీ, 5 లక్షలతో నిర్మించిన ముదిరాజ్ కుల సంఘ భవనాన్ని, బీబీరాజ్పల్లిలో రూ. 20 లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనం, 30 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, డ్రైనేజీ, 4.06 లక్షలతో నిర్మించిన కల్వర్టును మంత్రి ప్రారంభించారు. అలాగే చిల్వకోడూర్కు చెందిన వార్డు సభ్యుడు, కాం గ్రెస్ గ్రామ అధ్యక్షుడు బద్రి రవి, గౌడ సం ఘం అధ్యక్షుడు గంగయ్య, నాయకులు సిరా జ్, తాండ్ర ప్రశాంత్ బీఆర్ఎస్లో చేరగా, మం త్రి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ, నియోజకవర్గానికి 1100 మంది చొప్పున, ఒక్కో మండలానికి 200 మందికి దళితబంధు అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలో 50 లక్షల మంది ముస్లింల కోసం 2,200 కోట్లను ప్ర భుత్వం ఖర్చు చేసిందన్నారు. ఇటీవలే 7 వేల మంది మసీదు పూజారులను నియమించి, నె లకు 10 వేలు ఇస్తున్నట్లు తెలిపారు. చిల్వకోడూర్లో స్థలం లేని దళితులకు పట్టా సర్టిఫికె ట్లు అందిస్తామన్నారు. ఆయన వెంట జ డ్పీటీసీ జలంధర్, ఫ్యాక్స్ అధ్యక్షుడు రాజ సుమన్రా వు, వెంకటమాధవరావు, సర్పంచు లు సత్త య్య, పద్మావతీ రవీందర్, వసంత తిరుపతి, ఏ ఎంసీ చైర్మన్ హన్మండ్లు, వైస్ చైర్మన్ లింగారెడ్డి, వైస్ ఎంపీపీ సత్తయ్య, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమేశ్, యూత్ మండలాధ్యక్షుడు రవీందర్, నాయకులు జలంధర్, లక్ష్మీరాజం, కమలాకర్రావు, రాజేందర్, మల్ల య్య, సత్తయ్య, కనకయ్య, అశోక్రావు, స్వామి పాల్గొన్నారు.