ఇబ్రహీంపట్నం, జనవరి 17 : ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేట శివారులోని వ్యవసాయ భూముల్లో చిరుత పులి సంచారం కలకలం రేపుతున్నది. గ్రామశివారులోని అటవీ ప్రాంతంతోపాటు వ్యవసాయ తోటలలో రెండ్రోజులుగా సంచరిస్తున్నదని గ్రామస్తులు భయపడుతున్నారు.
ఈ మేరకు సమాచారం అందుకున్న ఎఫ్ఆర్వో షౌకత్ అలీ, బుధవారం గ్రామానికి చేరుకొని పాదముద్రలు పరిశీలించారు. ఏ జంతువో..? గుర్తించేందుకు పరిసర ప్రాంతాల్లో కలియదిరిగారు. సంచారం ఉన్న చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.