హుజూరాబాద్టౌన్, మార్చి 23: టీఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ విసృ్తత స్థాయీ సమావేశం హుజూరాబాద్ పట్టణంలోని సాయిరూప గార్డెన్స్ గురువారం ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్యాదవ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, అతిథులుగా టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవి రామకృష్ణారావు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల్ల విజయ-గణపతి, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి హాజరుకానున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, వైస్ఎంపీపీలు, సింగిల్విండో (పాక్స్) చైర్మన్లు, రైతు బంధు సమితి సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు,(పార్టీ రాష్ట్ర,జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి నాయకులు), విద్యార్థి, యువజన విభాగం నాయకులు, గ్రామ, మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
వీణవంక మార్చి 23: టీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ విస్తృత స్థాయీ సమావేశాన్ని విజయవంతం చేయాలని నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్యాదవ్ కోరారు. హుజూరాబాద్ పట్టణంలోని సాయిరూప గార్డెన్స్లో గురువారం సమావేశం ఉంటుదన్నారు. మండలంలోని టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై సమావేశాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.