సైదాపూర్, అక్టోబర్ 27: తొమ్మిదేండ్ల కేసీఆర్ పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులను చూసి బీఆర్ఎస్ను ఆదరించాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి వొడితల సతీశ్కుమార్ ప్రజలకు విజ్ఞప్తిచేశారు. వెన్నంపల్లి స్వయంభూ మత్స్యగిరీంద్రస్వామి ఆలయంలో మాజీమంత్రి హుస్నాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి ఇనుగాల పెద్దిరెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వెన్నంపల్లి, లస్మన్నపల్లి, ఆరెపల్లి, సోమా రం, బూడిదపల్లి, గెర్రెపల్లి, పశికపల్లి, ఎక్లాస్పూర్, దుద్దనపల్లి గ్రామాల్లో ప్రచారం చేశారు.
ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. ఒగ్గుడోలు నృత్యాలు, డప్పుచప్పుళ్లతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. బతుకమ్మలతో ఆహ్వానిం చారు. సతీశ్కుమార్ నుదుట తిలకం దిద్ది ఆశీర్వదించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులను వివరించారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే అందుబాటులో ఉండి సేవలందించానని చెప్పారు. మళ్లీ గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత ఆదర్శంగా తీర్చిదిద్దుతానని స్పష్టంచేశారు. తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
కార్యక్రమంలో ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సోమారపు రాజయ్య, వైస్ ఎంపీపీ రావుల శ్రీధర్రెడ్డి, సింగిల్విండో చైర్మన్లు కొత్త తిరుపతిరెడ్డి, బిల్ల వెంకటరెడ్డి, సర్పంచ్లఫోరం అధ్యక్షుడు కొండ గణేశ్, సర్పంచ్లు అబ్బిడి పద్మారవీందర్రెడ్డి, చంద శ్రీనివాస్, కాయిత రాములు, ఆవునూరి పాపయ్య, పైడిమల్ల సుశీలాతిరుపతిగౌడ్, కొత్త రాజిరెడ్డి, తాటిపల్లి యుగేంధర్రెడ్డి, బత్తుల కొమురయ్య, బొడిగ పద్మజాకొంరయ్య, బర్మావత్ అక్షయాశ్రీనివాస్నాయక్, ఎంపీటీసీ బద్దిపడిగ అనితారవీందర్రెడ్డి, గుండేటి సునితారాణిజయకృష్ణ, రైతుబందు సమితి మండల కోఆర్డీనేటర్ రావుల రవీందర్రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు చెల్మల్ల రాజేశ్వర్రెడ్డి, దిశ కమిటీ సభ్యులు ఓరుగంటి దేవేంద్ర పాల్గొన్నారు.