వేములవాడ టౌన్, జూన్ 27: వేములవాడ రాజన్న క్షేత్రం సోమవారం భక్తజన సంద్రమైంది. సుమారు 40 వేలమందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
ఉదయం 5 గంటల నుంచే ఉచిత, శీఘ్ర దర్శన క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. దర్శనానికి 2 నుంచి 3 గంటలపాటు సమయం పట్టిందని, కోడెమొక్కుకు మరో 2 గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. ఆలయానికి దాదాపు రూ.24 లక్షలకు పైగా ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు.