వేములవాడ టౌన్, డిసెంబర్ 1: రాజన్న క్షేత్రంలో కొత్త సంవత్సర శోభ కనిపించింది. ఆదివారం ఆలయ ఆవరణ భక్తజనంతో కిక్కిరిసిపోయింది. పట్టణంతోపాటు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు క్యూలైన్లలో బారులు తీరి రాజన్నను దర్శించుకున్నారు.
అర్చకుల సమక్షంలో ప్రత్యేక పూజలు చేశారు. కొత్త ఏడాదిలో తమ కోరికలను నెరవేర్చాలని, పిల్లాపాపలను సల్లంగా చూడాలని స్వామివారిని వేడుకున్నారు. అలాగే రాజన్న అనుబంధ దేవాలయాలైన శ్రీ భీమేశ్వర, బద్దిపోచమ్మ, నగరేశ్వరాలయాల్లో కూడా భక్తుల రద్దీ కనిపించింది.