సిటీబ్యూరో, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): రుతుపవన ద్రోణి, ఆవర్తన ప్రభావంతో గ్రేటర్లో పలు చోట్ల తేలికపాటి వర్షం కురిసింది. రాత్రి 9 గంటల వరకు నగరంలోని కూకట్పల్లిలో అత్యధికంగా 2.0 సెం.మీలు, కుత్బుల్లాపూర్లో 1.93 సెం.మీలు, శంషిగూడలో 1.60 సెం.మీలు, బాచుపల్లిలో 1.53 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు.
ద్రోణి ప్రభావం కొనసాగుతుండడంతో రెండు రోజులు గ్రేటర్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 31.0 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 24.3 డిగ్రీలు, గాలిలో తేమ 85శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.