Pensioners | జగిత్యాల ఆగస్టు 31: పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి టీపీసీఏ రాష్ట్ర అధ్యక్షుడు గాజుల నర్సయ్య ఆధ్వర్యంలో రాజీలేని పోరాటం చేస్తామని తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ అన్నారు. ఆ సంఘం జిల్లా ఎన్నికలు ఆదివారం ఏకగ్రీవంగా జరిగాయి. సీనియర్ సిటీజేన్స్ జిల్లా కార్యాలయంలో జరిగిన ఈ ఎన్నికల్లో ఐదో సారి హరి ఆశోక్ కుమార్ పెన్షనర్ల జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
రిటైర్డ్ జిల్లా అధికారి పబ్బా శివానందం ఎన్నికల అధికారిగా వ్యవహరించగా జిల్లా అధ్యక్షుడుగా హరి ఆశోక్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా పీసీ హన్మంత రెడ్డి, కోశాధికారిగా గౌరిశెట్టి విశ్వనాథం, అసోసియేట్ అధ్యక్షుడిగా బొల్లం విజయ్, ఉపాధ్యక్షులుగా వెల్ముల ప్రకాష్ రావు, కే సత్యనారాయణ, ఏ విజయలక్ష్మి, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా ఎండీ యాకూబ్, బీ కరుణ, సయ్యద్ యూసుఫ్, సంయుక్త కార్యదర్శులుగా దిండిగాల విఠల్, ఎండీ ఇక్బాల్, కే గంగాధర్, కార్యవర్గ సభ్యులుగా 12 మంది వీ మురళీదర్, వీ దేవేందర్రావు, ఎస్ దుబ్బేష్ కే నారాయణ, కే గంగారెడ్డి, బీ నర్సయ్య, జీ చంద్రయ్య, ఏ వీరారెడ్డి, టీ బ్రహ్మయ్య, కే సత్యనారాయణ, ఈ రాములు, ఎన్ సంజీవ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఎన్నికైన ప్రతినిధులకు రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి టీ జీవన్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్ కుమార్, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. టీజీఈ జెఏసీ జిల్లా చైర్మన్ మిర్యాల నాగేందర్ రెడ్డి, రెవెన్యూ( ట్రెసా) జిల్లా అధ్యక్షుడు ఎండీ వకీల్ ఆధ్వర్యంలో వారి కార్యవర్గాలు, మున్సిపల్ మాజీ చైర్మన్ జీఆర్ దేశాయ్, జగిత్యాల, కోరుట్ల, మెట్ పల్లి, రాయికల్, ధర్మపురి, మల్యాల పెన్షనర్స్ సంఘాల ప్రతినిధులు బీ రాజేశ్వర్, పీ శివానందం, రాజ్ మోహన్, ఏనుగంటి రాములు, కండ్లే గంగాధర్, ఎండీ యాకూబ్ ఘనంగా సన్మానించారు.