చొప్పదండి, జూన్ 8: తెలంగాణ పథకాలే దేశానికే ఆదర్శమని జడ్పీటీసీ మాచర్ల సౌజన్య, మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ పేర్కొన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం మండలంలో ఊరూరా చెరువుల పండుగను ఘనంగా నిర్వహించారు. కాగా, చొప్పదండి పట్టణంలోని కుడి చెరువు వద్ద మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మాచర్ల సౌజన్య, మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ మాట్లాడుతూ, అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమాల్లో వైస్ ఎంపీపీ మునిగాల విజయలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం చుక్కారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చీకట్ల రాజశేఖర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్ గౌడ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్ రెడ్డి, పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్ రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సింగిల్ విండో డైరెక్టర్లు పాల్గొన్నారు.
రామడుగు మండలంలో..
రామడుగు, జూన్ 8: మండలంలోని చెరువులు, కుంటలతో పాటు వరదకాలువ పరివాహక గ్రామాల్లో చెరువుల పండుగను ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయాల ఆవరణ, గ్రామ కూడళ్లలో మహిళా ప్రజాప్రతినిధులు, మహిళలు బతుకమ్మ ఆడారు. చెరువుల వద్దకు చేరుకొని కట్ట మైసమ్మకు మొక్కులు చెల్లించి, గంగమ్మతల్లికి పుష్పాలతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వీర్ల వేంకటేశ్వరరావు, ఎంపీపీ కలిగేటి కవిత-లక్ష్మణ్, సర్పంచులు వీర్ల సరోజన-ప్రభాకర్రావు, పంజాల ప్రమీల-జగన్మోహన్గౌడ్, బండ అజయ్రెడ్డి, జంగిలి శ్రీలత-రాజమౌళి, నాగుల రాజశేఖర్గౌడ్, గుండి మానస-ప్రవీణ్, చిలుమలు రజిత-ప్రభాకర్, జవ్వాజి శేఖర్, చాడ ప్రసన్న-శేఖర్రెడ్డి, జుట్ట రాజేశ్వరి-లచ్చయ్య, చంటి జీవన్, బక్కశెట్టి నర్సయ్య, సైండ్ల కవిత-కరుణాకర్, మొగుల్ల ఎల్లయ్య, మన్నె దర్శన్రావు, ఉప్పు రాధమ్మ, అంబటి నారాయణ, సాదు పద్మ-మునీందర్రెడ్డి, వొంటెల అమరేందర్రెడ్డి, కర్ర సత్యప్రసన్న, కోల రమేశ్, అభిషేక్రెడ్డి, జాడి లక్ష్మీరాజమల్లు, ఎంపీటీసీలు ఎడవెల్లి నరేందర్రెడ్డి, ఎడవెల్లి కరుణశ్రీ-పాపిరెడ్డి, మడ్డి శ్యాంసుందర్గౌడ్, కనుకం జయ-కనకయ్య, తొరికొండ అనిల్, కొత్త పద్మ, ఆర్బీఎస్ మండల కో-ఆర్డినేటర్ జూపాక కరుణాకర్, ఏఎంసీ చైర్మన్ మామిడి తిరుపతి, ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు వీర్ల సంజీవరావు, మాజీ ఎంపీపీ మార్కొండ కిష్టారెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
గంగాధర, జూన్ 8: మండలంలోని 33 గ్రామాల్లో మహిళలు బతుకమ్మలు పేర్చి ప్రధాన కూడళ్లలో పెట్టి ఆడి పాడారు. అనంతరం స్థానికంగా ఉన్న చెరువులు, కుంటల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. కట్ట మైసమ్మకు బోనాల్లో తెచ్చిన నైవేద్యం సమర్పించి, మొకులు చెల్లించుకున్నారు. అనంతరం చెరువు కట్టలపై గ్రామస్తులంతా కలిసి సామూహికంగా భోజనాలు చేశారు. బూరుగుపల్లిలో ఎమ్మెల్యే సతీమణి సుంకె దీవెన, లక్ష్మీదేవిపల్లి, కొండాయపల్లి, చెర్లపల్లి(ఆర్) గ్రామాల్లో జడ్పీటీసీ పులం అనురాధ-నర్సయ్య, గంగాధర సింగిల్ విండో చైర్మన్ దూలం బాలాగౌడ్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు అట్ల రాజిరెడ్డి, గంగాధరలో మారెట్ కమిటీ చైర్మన్ లోకిని ఎల్లయ్య, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మడ్లపెల్లి గంగాధర్, కురిక్యాలలో సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిర్మల్రావు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్ రావు, ఆయా గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, ఉపసర్పంచులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
కొత్తపల్లి, జూన్ 8: కొత్తపల్లి మండలం చింతకుంట, కమాన్పూర్, ఎలగందులతో పాటు ఆసీఫ్నగర్లో చెరువుల పండుగ నిర్వహించారు. ఆసీఫ్నగర్లో రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్తో కలిసి బతుకమ్మ ఎత్తుకొని మహిళలతో ఊరేగింపుగా చెరువు వద్దకు చేరుకొని కట్ట మైసమ్మకు పూజలు చేశారు. ఏఎంసీ చైర్మన్ రెడ్డవేని మధుతో కలిసి మర పడవపై చెరువులో విహరించారు. చెరువు ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. మిషన్ కాకతీయతో ప్రతి గ్రామంలో చెరువు నీటితో కళకళలాడుతున్నదని తెలిపారు. అనంతరం గ్రామస్తులు చెరువు వద్ద సామూహిక భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పిల్లి శ్రీలత-మహేశ్గౌడ్, జడ్పీటీసీ పిట్టల కరుణ-రవీందర్, సర్పంచ్ కడారి శాంత, ఎంపీటీసీ దావ మణి, ఎంపీడీవో శ్రీనివాస్రెడ్డి, ఎమ్మార్వో నల్ల వెంకట్రెడ్డి, ఇరిగేషన్ ఎస్ఈ శివరాం, ఏఈ నవీన్, మాజీ ఎంపీటీసీ పెరుక లక్ష్మణ్రావు, వార్డు సభ్యుడు తుల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. కొత్తపల్లి పట్టణంలో మహిళలు బోనాలు ఎత్తుకొని ఊరేగింపుగా చెరువు వద్దకు చేరుకున్నారు.
కట్ట మైసమ్మకు, గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, కమిషనర్ కట్ల వేణుగోపాల్, ఇన్చార్జి ఇరిగేషన్ డీఈ సమ్మయ్య, కౌన్సిలర్లు, ప్రజలు పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్, జూన్ 8: మండలంలో చెరువుల పండుగను ఘనంగా నిర్వహించారు. చామనపల్లిలోని అప్పన్న చెరువు వద్ద ఏర్పాటు చేసిన బతుకమ్మ తల్లి విగ్రహాన్ని మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, వైస్ ఎంపీపీ నారాయణ, సర్పంచులు భూమయ్య, బోగొండ లక్ష్మి, చామనపల్లి అరుణ, దబ్బెట రమణారెడ్డి, సిరిగిరి దుర్గ, గాజుల వెంకటమ్మ, కట్ల లక్ష్మి, కటుకం నందు, ఊరడి మంజుల, బలుసుల శారద, జక్కం నర్సయ్య, ఉప్పుల శ్రీధర్, వడ్లూరి సంతోష, ఎంపీటీసీలు బుర్ర తిరుపతిగౌడ్, చల్ల రామక్క, దామెరపల్లి పుష్ప, సాయిల వినయ్సాగర్,అంకమల్ల శ్రీనివాస్, ఉపసర్పంచులు చిట్కూరి శేఖర్, ఆరె శ్రీకాంత్, శంకర్, ఎంపీడీవో జగన్మోహన్రెడ్డి, పీఆర్ ఏఈ రమణారెడ్డి, తహసీల్దార్ నారాయణ, ఆర్ఐ రజినీకాంత్, ఏపీవో శోభ రాణి, సొసైటీ డైరెక్టర్ మారుతి, పంచాయతీ కార్యదర్శి ప్రభాకర్ పాల్గొన్నారు.