Chigurumamidi | చిగురుమామిడి, ఆగస్టు 1 : చిగురుమామిడి మండలంలోని రేకొండ, సుందరగిరి, గునుకుల పల్లె, సీతారాంపూర్ గ్రామాల్లో గ్రామ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా శనివారం గ్రామపంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామ సభలో2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను చేపట్టాల్సిన అభివృద్ధి పనులను గ్రామ సభలో నిర్ణయించారు. 16వ ఆర్థిక సంఘం నిధులు, స్టేట్ ఫైనాన్స్, ఎస్ఎఫ్టీ, జనరల్ ఫండ్ మొదటి నిధుల నుండి చేపట్టాల్సిన అభివృద్ధి పనులను గ్రామసభలో తీర్మానించారు.
గ్రామాల్లో అంటూ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు, ఇంటింటా ఇంకుడు గుంతలు, పొలానికి పంటకుంట, ఊరికి ఊరకుంట, తాగునీరు, విద్యుత్, రోడ్లు, మురికి కాలువలు మొదలగు అభివృద్ధి పనులను తీర్మానించారు. ఈ గ్రామ సభలో గ్రామ సర్పంచులు అల్లెపు సంపత్, జంగ శిరీష, గునుకుల మధుసూదన్ రెడ్డి, గోగూరి లక్ష్మి, పంచాయతీ కార్యదర్శులు గోదారి అజయ్, సంపత్, అరుణ్, కాల్వ రమేష్ ఏఈవోలు అఖిల, రాకేష్, వార్డు సభ్యులు, వివిధ శాఖల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.