జమ్మికుంట, ఏప్రిల్ 19: రైతు పండించిన ప్రతిగింజనూ ప్రభుత్వ మద్దతు ధరతో కొంటామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి భరోసా ఇచ్చారు. రైతును రాజుగా చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని, దేశంలో ఎక్కడాలేని విధంగా రైతు బంధు, రైతు బీమా, 24గంటల ఉచిత కరెంట్, సాగునీరు అందిస్తున్నారని కొనియాడారు. జమ్మికుంట మండలంలో బుధవా రం ఆయన పర్యటించారు. తనుగుల, మాచినపెల్లి, ధర్మారం, జమ్మికుంట పాత వ్యవసాయ మార్కెట్ యార్డులలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. రైతుల సమస్యలు తెలిసిన వ్యక్తిగా కేసీఆర్ సీఎంగా ఉండడం మన అదృష్టమని చెప్పారు.
రైతులు దళారులను నమ్మిమోసపోవద్దని, తాము పండించిన ధా న్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం క్వింటాల్ గ్రేడ్-ఏ కు 2060, సాధారణ రకానికి 2040 మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నదని చెప్పారు. అంతకుముందు తనుగుల, ధర్మారం, మున్సిపల్ ప రిధిలోని మృతి చెందిన రైతు కుటుంబాలకు రై తుబీమా ప్రొసీడింగ్ పత్రాలు అందించారు. అలాగే పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను కూ డా ఇచ్చారు. ఆయా కార్యక్రమాల్లో డీసీసీబీ వై స్చైర్మన్ రమేశ్, మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రా జేశ్వర్రావు, ఎంపీపీ మమత, జడ్పీటీసీ డాక్టర్ శ్యాం, జమ్మికుంట పీఏసీఎస్ చైర్మన్ సంపత్, మార్కెట్కార్యదర్శి రెడ్డినాయక్ పాల్గొన్నారు.