ధర్మారం/పెద్దపల్లి, ఆగస్టు4: గౌడ కులస్తులు మురిసిపోతున్నారు. సర్వాయి పాపన్న జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తామని ప్రభు త్వ ప్రకటనపై గురువారం జిల్లాలో పలుచోట్ల సంబురాలు చేసుకున్నారు. ధర్మారం మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట సర్వాయి పాపన్న గౌడ సంఘం మండలాధ్యక్షుడు పాకాల రాజయ్య అధ్వర్యంలో సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్ చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు.
ఇక్కడ సంఘం రాష్ట్ర నాయకుడు తాళ్లపల్లి లింగయ్య, జిల్లా గీత కార్మికులు సంక్షేమ సంఘం అధ్యక్షుడు మూల మల్లేశం, నియోజక వర్గ కన్వీనర్ నాగుల రాజేశం, కొత్తూరు సర్పంచ్ తాళ్ల మల్లేశం, నాయకులు నాడెం శ్రీనివాస్, తిరుపతి, రాజు, రమేశ్, చంద్రయ్య, బాలయ్య, లింగ య్య, తిరుపతి పాల్గొన్నారు. అలాగే జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద గౌడ కులస్తుల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఇక్కడ గౌడ కులస్తులు ఈశ్వర్గౌడ్, సమ్మయ్య గౌడ్, బుర్ర నరేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.