మెట్పల్లి, డిసెంబర్ 23: ప్రజాసేవే లక్ష్యంగా వైద్యవృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల తన తొలి ప్రయత్నంలో అసెంబ్లీలో అడుగుపెట్టారు. గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే కార్యక్రమం పేరిట పట్టణాలు, పల్లెల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం మెట్పల్లి పట్టణంలోని 6వ వార్డును సందర్శించారు. వార్డులో పర్యటిస్తూ ప్రజలను ఆత్మీయంగా పలుకరిస్తూ తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్కు సంబంధించిన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వార్డులో అక్కడక్కడ ప్రజలు విన్నవించిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. మరికొన్ని క్షేత్రస్థాయి సమస్యలను వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. వార్డుల్లో ప్రజలకు ఇబ్బంది కలుగకుండా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే వైద్యం కోసం ఆర్జించిన పలువురి రోగులకు సంబంధించి వైద్యసేవలు అందించారు. ఎమ్మెల్యే పొద్దున్నే తమ వార్డుకు వచ్చి పర్యటించడంపై స్థానికులు సంతోషం వెలిబుచ్చారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ ఉపాధ్యక్షుడు బోయినపల్లి చంద్రశేఖర్రావు, వార్డు కౌన్సిలర్ బంగారు కాళ్ల కిషోర్, కమిషనర్ జగదీశ్వర్గౌడ్ పాల్గొన్నారు.