పెద్దపల్లి, జూలై 6(నమస్తే తెలంగాణ)/ ధర్మారం/ రామడుగు/ మల్యాల/ మెట్పల్లిరూరల్: కాళేశ్వర గంగ పరుగులు తీస్తున్నది. తన దిశను మార్చుకొని ఎస్సారెస్పీ వైపు పరవళ్లు ప్రాజెక్టుకు చేరువగా వెళ్లింది. రామగుండం ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కాళేశ్వరం ఇంజనీరింగ్ ఇరిగేషన్ అధికారుల నిరంతర పర్యవేక్షణలో లింక్-1లో 15 మోటర్లు, లింక్-2లో నా లుగు మోటర్లు నిరంతరాయంగా నడుస్తున్నాయి. ఆయా పంప్హౌస్లలోని ఒక్కో మోటర్కు విరా మం ఇస్తూ ప్రాణహిత ఇన్ఫ్లోకు అనుకూలంగా పంపులను నడిపిస్తున్నారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కన్నెపల్లిలోని లక్ష్మీ పంపుహౌస్లో 7 మోటర్లను ఆన్చేసి 15,400 క్యూసెక్కుల నీటిని అన్నారంలోని సరస్వతీ బరాజ్లోకి తరలిస్తున్నారు.
అక్కడికి చేరిన నీటిని పెద్దపల్లి జిల్లా మంథని మండలం కాసిపేలోని సరస్వతీ పంపు హౌస్లో నాలుగు పంపులను ఆన్ చేసి 11,720 క్యూసెక్కుల నీటిని మంథని మండలం సిరిపురంలోని పార్వతీ బరాజ్లోకి ఎత్తిపోస్తున్నారు. ఇక అంతర్గాం మండలంలో గోలివాడలోని పార్వతీ పంపు హౌస్లో 4 మోటర్లను ఆన్ చేసి 10,440క్యూసెక్కుల నీటిని ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎత్తిపోస్తున్నారు. ఎల్లంపల్లికి చేరిన కాళేశ్వరం జలాలను ధర్మారం మండలం నందిమేడారంలోని నంది పంపుహౌస్లో 2 బాహుబలి మోటర్లను ఆన్ చేసి 6300 క్యూసెక్కుల నీటిని లిఫ్ట్ చేస్తున్నారు. గ్రావిటీ కాలువ ద్వారా 5.7 కిలోమీటర్లు ప్రవహించిన కాళేశ్వరం జలాలు వరదకాలువకు చేరుకొని, ఎస్సారెస్పీ పునర్జీవ పథకంలో భాగంగా నిర్మించిన పంప్హౌస్ల గుండా ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు ఎదురెక్కుతున్నాయి.
వరద కాలువలో వడివడిగా..
గాయత్రీ పంప్హౌస్ నుంచి తరలివస్తున్న జ లాలు ఎస్సారెస్పీ వైపు పరుగులు తీస్తున్నాయి. 122 కిలోమీటర్ల మేర ఉన్న వరద కాలువలో 73వ మైలురాయి వద్ద నిర్మించిన రాంపూర్ పంప్హౌస్లో నాలుగు మోటర్ల ద్వారా మొత్తం 5800 క్యూసెక్కుల జలాలు బుధవారం రాత్రికే రాజేశ్వర్రావుపేట (వరదకాలువ 34వ కిలోమీటరు) వద్ద నిర్మించిన పంపుహౌస్కు చేరుకున్నాయి. గు రువారం ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల మధ్యలో మూడు మోటర్లు ఆన్ చేసి ఒక్కో మో టర్ ద్వారా 1450 క్యూసెక్కుల చొ ప్పున మొత్తం 4,350 క్యూసెక్కుల నీటిని రాజేశ్వర్రావుపేట పంపుహౌస్ నుంచి వరదకాలువ ఎగువ ప్రాంతానికి తరలిస్తున్నట్లు డీఈ రూప్లానాయక్ పేర్కొన్నారు. ఎగువన ఉన్న నిజామాబాద్ జిల్లాలోని ముప్కాల్ (వరదకాలువ 0.10 కిలోమీటర్) పం పుహౌస్కు కాళేశ్వరం జలాలు తరలుతున్నాయి. ఒకటి రెండు రోజుల్లో ప్రాజెక్టులోకి జలాలు చేరుకుంటాయని అధికారులు వెల్లడించారు.