తెలంగాణచౌక్, ఫిబ్రవరి 7: రాష్ట్ర బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమానికి నిధులు కేటాయించడంపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల నాయకులు మంగళవారం హర్షం వ్యక్తం చేశారు. నగరంలోని తెలంగాణచౌక్లో ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్ ఫొటోలు ఉన్న ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈసందర్భంగా కుల సంఘాల జేఏసీ చైర్మన్ జీఎస్ ఆనంద్ మాట్లాడుతూ, కేసీఆర్ ప్రధాని అయితే తెలంగాణ పథకాలు దేశ వ్యాప్తంగా అమలు చేస్తారని పేర్కొన్నారు. కుల సంఘాల నాయకులు రవీందర్గౌడ్, సత్యం, శ్రీనివాస్, సతీశ్, వెంకటేశ్, నజీర్, ప్రసాద్బాబు, నాయక్, నాగరాజు పాల్గొన్నారు.
కార్పొరేషన్, ఫిబ్రవరి 7: రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసే నిధులను నేరుగా మున్సిపాలిటీల ఖాతాల్లోనే జమ చేయాలని నిర్ణయించడంపై మున్సిపల్ కాంట్రాక్టర్లు హర్షం వ్యక్తం చేశారు. స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో మంగళవారం సీఎం కేసీఆర్, మంత్రి గంగుల కమలాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ట్రెజరీతో సంబంధం లేకుండా నేరుగా నిధులను స్థానిక సంస్థల అకౌంట్లోనే జమ చేయాలని నిర్ణయం తీసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఇందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్లు చిందం శ్రీనివాస్, ఒర్సు ఐలయ్య, ఆవుల మధుకర్, కస్తూరి వరప్రసాద్, గండి రాజేశ్వర్, ఒర్సు మహేశ్, కుమారస్వామి, గణపతిరెడ్డి, భగవాన్, ఆనందరావు, వెంకటేశ్వరరావు, ప్రవీణ్ పాల్గొన్నారు.
చొప్పదండి, ఫిబ్రవరి 7: రాష్ట్ర బడ్జెట్లో దళితబంధు పథకానికి రూ.17,700 కోట్లు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేస్తూ మండలంలోని గుమ్లాపూర్లో బీఆర్ఎస్ ఎస్సీ సెల్ గ్రామాధ్యక్షుడు కనకం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఫొటోలతో కూడిన ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, దళితబంధు పథకంతో దళితులు ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారని పేర్కొన్నారు. దళితుల సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్కు రుణపడి ఉంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు వెల్మ రఘుపతిరెడ్డి, ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు ముద్దం కుమార్, వార్డు సభ్యులు కోలపూరి హన్మంతు, కడారి కొమురయ్య, దాసరి రాజయ్య, రైతు విభాగం అధ్యక్షుడు రాగల శ్రీనివాస్, నాయకులు బీసవేని రాజశేఖర్, గుమ్ముల సత్యం, మల్లేశం, పెరుమండ్ల మహేశ్, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.