పెద్దపల్లి, మార్చి 22(నమస్తే తెలంగాణ): ప్ర భుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం పెద్దపల్లి జిల్లా లో విజయవంతంగా కొనసాగుతున్నది. దృష్టి లో పాల తో బాధపడుతున్న వారికి ఉచిత కంటి పరీక్షలు చేసి కంటి వెలుగులు ప్రసాదిస్తున్న కంటి వెలుగు-2ను జిల్లాలో జనవరి 19న మంత్రి కొప్పుల ఈశ్వర్, కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణతో కలిసి ప్రారంభించినప్పటి నుంచి 100 పని దినా ల పాటు 34 వైద్య బృందాల ద్వారా 34 వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, వైద్య సిబ్బంది ప్రజలు ఎకువగా క్యాంపులకు తరలివచ్చే విధంగా చైతన్యం కల్పిస్తున్నారు. కంటి వెలుగు క్యాంపులకు విశేష స్పందన లభిస్తున్నది. క్యాంపులో వైద్యాధికారి, ఆప్తమాలాజిస్ట్, డాటా ఎంట్రీ ఆపరేటర్, ఇద్దరు ఏఎన్ఎంలు, ఒక హెల్త్ సూపర్వైజర్, ముగ్గురు ఆశ కార్యకర్తలు అందుబాటులో ఉంటున్నారు.
తగ్గుతున్న కంటి సమస్యలు
కంటి వెలుగు-2లోజిల్లాలోని 4.90 లక్షల మం దికి పరీక్షలు చేయాలనే లక్ష్యంగా 34 వైద్య శిబిరాలను నిర్వహించి 100పనిదినాల్లో పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ నెల 21వరకు 41పని దినాల్లో 2లక్షల 10మందికి కంటి పరీక్షలు చేశా రు. ఇందులో 32,824 మందికి రీడింగ్ గ్లాసెస్, 10,073మందికి ప్రిస్ర్కైబ్డ్ అద్దాలను పంపిణీ చేశారు. దీంతో జిల్లాలో ఇప్పటికే 200010మందికి కంటి చూపు సమస్య నుంచి ఉపశమనం ల భించినట్లయింది. కంటి వెలుగు ఉచిత పరీక్షలతో ప్రజల నేత్ర సమస్యలు తగ్గుతున్నాయి. ఇంకా 59రోజుల్లో 2లక్షల 89వేల మందికి పరీక్షలు చేయడమే లక్ష్యంగా శిబిరాలను నిర్వహిస్తున్నారు.
కలెక్టర్ ప్రత్యేక దృష్టి
జిల్లాలో కంటి వెలుగును విజయవంతం చేసేందుకు కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలో 34 వైద్య బృందాలతో క్యాంపులను ఏర్పాటు చేసి ప్రతి రోజూ సమీక్షిస్తున్నారు. కంటి వెలుగు క్యాం పులకు సమయానికి వచ్చే విధంగా.. గ్రామాల్లోని పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, రేషన్ డీలర్లు, ఇతర అధికారుల తో బృందాలను ఏర్పాటు చేసి క్యాంపులకు రావాల్సిన సమయాన్ని సూచిస్తూ ఇంటి వద్దకు ఆహ్వాన పత్రికలను పంపిణీ చేయిస్తున్నారు.
బఫర్ బృందాలతో ప్రత్యేక శిబిరాలు
పెద్దపల్లి జిల్లాలో 34క్యాంపులను నిర్వహిస్తూనే బఫర్ బృందాలతో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. ఉద్యోగులు, జర్నలిస్టులు, పోలీసు లు, న్యాయవాదులు, వివిధ వర్గాల వారికి ఎక్కడ సమూహంగా ఉంటే అక్కడే శిబిరాలు ఏర్పాటు చేసి, పరీక్షలు చేయిస్తున్నారు. కంటి వెలుగు కార్యక్రమం ఒక వరంలా మారిందని, పైసా ఖర్చు లేకుండా ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి అద్దాలు అందిస్తున్నారని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
టార్గెట్ను పూర్తి చేస్తాం ..
-డా ప్రమోద్కుమార్, డీఎంహెచ్వో (పెద్దపల్లి)
ప్రభుత్వం ఇచ్చిన 100రోజుల్లోనే టార్గెట్గా ఉన్న 4లక్షల 90వేల మందికి పరీక్షలు చేసే విధం గా కలెక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ నిరంతర పర్యవేక్షణలో ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సా గుతున్నాం. ఇప్పటి వరకు 2లక్షల 10మందికి ప రీక్షలు పూర్తయ్యాయి. ఇంకా 59 పని దినాల్లో 2 లక్షల 89వేల మందికి కంటి పరీక్షలు పూర్తి చేస్తాం. కంటి వెలుగు క్యాంపుకు వచ్చిన ప్రతి వ్యక్తి వివరాలను ట్యాబ్లో నమోదు చేస్తున్నాం. దూర, దగ్గరి దృష్టి పరీక్షలు చేసి అవసరమైన వారికి వెంటనే రీడింగ్ గ్లాసులు అందిస్తూ, ప్రిస్ర్కైబ్ ్డఅద్దాలు అవసరమైన వారికి ఆర్డర్ చేసి అందిస్తు న్నాం. కంటి వెలుగు క్యాంపుల నిర్వహణలో ప్రజాప్రతినిధులు, అధికారులు చురుకైన పాత్ర వహిస్తున్నారు. ప్రజలు వినియోగించుకునేలా ముందస్తుగా అవగాహన కల్పిస్తున్నారు.
ముగ్గురికి అద్దాలిచ్చిండ్రు
నేను ప్రైవేటు ఉద్యోగిని. మా కుటుంబంలో ముగ్గురం కంటి వెలుగు శిబిరంలో పరీక్షలు చేయించుకున్నం. డాక్టర్లు ముగ్గురికి కంటి అద్దాలిచ్చిన్రు. అదే ప్రైవేట్ దవాఖానలో చూపించుకుంటే వేలకు వేలు అయ్యేది. మళ్ల అద్దాలకు గూడ పైసలయ్యేది. కంటివెలుగులో ఉచితంగా పరీక్షలు చేసి కళ్లద్దాలు కూడా ఇవ్వడం అదృష్టం. కేసీఆర్ సార్కు రుణపడి ఉంటం.
– కాసారపు శ్రీనివాస్, ప్రైవేట్ ఉద్యోగి, తిలక్నగర్ (గోదావరిఖని)
పైసా పెట్టకుండా అద్దాలిచ్చిన్రు
నాకు చానేండ్లుగ కండ్లు మసక మసకగ కనిపించేది. ఈ వయసులో అందరికి వస్తదిలే అనుకున్న. దవాఖానకు పోతే వేలకు వేలు అయితయ్ని పోలేదు. ఇంతల్నె సీఎం కేసీఆర్ కంటి వెలుగు పథకం తెచ్చి అందరికీ ఉచితంగా కంటి పరీచ్చలు, అద్దాలు ఇస్తున్నారని తెలిసి పోయిన. డాక్టర్లు టెస్ట్లు చేసి అద్దాలనిచ్చిన్రు. పైసా ఖర్చు లేకుండా అద్దాలు చేతిలకచ్చినయ్. వచ్చే ఎన్నికల్లో మా ఇంటి ఓట్లన్నీ కేసీఆర్ సారుకే.
– ఎం రాధ, గృహిణి, సీతానగర్ (గోదావరిఖని)
కండ్లు మంచిగ కనిపిస్తున్నయి
నాకు కొంత కాలం సంది కండ్లు మసకగ కనిపిత్తున్న య్. మా ఊల్లనే స ర్కారు ఫ్రీగ ఉచితంగా కం టద్దాలు ఇత్తున్నరని సాటిం పు చేసిన్రు. ఇగ తెల్వంగనే గ్రామ పంచాయతీ కార్యాలయంలో కంటి పరీక్షలు చేయించుకున్న. మంచి మిషన్ పెట్టి పరీక్ష చేసిన్రు. డాక్టర్ పరీక్షలు చేసి నాకు కంటి చూపు తగ్గిందని చెప్పిండు. పైసలు తీసుకోకుండనే అద్దాలిచ్చిన్రు. వాటిని పెట్టుకుంటే కండ్లు మంచిగ కనిపిత్తున్నయ్.
– బత్తిని రాజయ్య, ధర్మారం