Chigurumamidi | చిగురుమామిడి, మే 9: చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గంగిశెట్టి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య శిబిరంలో శ్రీనివాస విజన్ సెంటర్, మెడికవర్ హాస్పిటల్ కి చెందిన వైద్య సిబ్బంది 258 మందికి ఉచితంగా బీపీ, షుగర్, ఈసీజీ, కంటి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.
29 మందికి కంట్లో పొరలు ఉన్నట్టు గుర్తించి వారికి ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించడం జరుగుతుందని కంటి వైద్య నిపుణులు తిప్పారపు శ్రీనివాస్ తెలిపారు. వైద్య శిబిరంలో పాల్గొన్న రోగులందరికీ ఉచితంగా భోజన వసతి కల్పించారు. వైద్య శిబిరంలో ట్రస్ట్ ఫౌండర్ గంగిశెట్టి జగదీశ్వర్, సర్పంచ్ అల్లేపు సంపత్, కారోబార్ పీరల్ల రాజకుమార్, ఫీల్డ్ అసిస్టెంట్ గోపగోని తిరుపతి, సతీష్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.