Veenavanka | వీణవంక, జనవరి 28 : వీణవంక మండలంలోని ఇప్పలపల్లి, హిమ్మత్నగర్, గ్రామాల్లో మహిళా శక్తి సంఘ భవన నిర్మాణాలకు బుధవారం సర్పంచ్లు మెతుకు కుమార్రెడ్డి, జడల శ్రీకాంత్, ఏపీఎం సుధాకర్, స్థానికులు శంఖు స్థాపనలు చేశారు. కొబ్బరికాయలు కొట్టి, భూమిపూజ చేసి భవనాల నిర్మాణాలకు శంఖుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు సమావేశాలు నిర్వహించుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి భవనాల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్లు నవీన్, మ్యాక శ్రీనివాస్, వార్డు సభ్యులు, సీసీలు వీ తిరుపతి, పీ తిరుపతి, ఆనంద్, వీవోఏలు, అంగన్వాడీ టీచర్లు, నాయకులు నల్ల తిరుపతిరెడ్డి, మారం తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.