కలెక్టరేట్, ఏప్రిల్ 26 : ‘ఎన్నికల సంవత్సరం వచ్చింది. తెలంగాణ వ్యతిరేక శక్తులు మళ్లీ బయల్దేరినయ్. మాయ మాటలతో లొంగదీసుకుని, అధికారం చేపట్టాలనే కుట్రలు చేస్తున్నయ్. వాటి మాయమాటలకు లొంగితే మునిగిపోతం. మోసపోతే గోసపడుతం. మన సంపదను దోచుకుని, ఇపుడిప్పుడే ఎదుగుతున్న తెలంగాణ రా ష్ర్టాన్ని తిరిగి ఆంధ్రాలో కలిపే ప్రమాదముంది, ప్రజలారా బహుపరాక్’ అంటూ రాష్ట్ర బీసీ సం క్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. కరీంనగర్లోని మారుతినగర్లో 1.28కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు బుధవారం మంత్రి గంగుల శం కుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ, కరీంనగర్ ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయొద్దనే ఆలోచనతో ముందుకు సాగుతున్నట్లు స్పష్టం చేశారు.
అందుకోసం వేలాది కోట్ల రూపాయలు తెచ్చి, కరీంనగర్ రూపురేఖలు మార్చామన్నారు. పనులను త్వరితగతిన పూర్తిచేసి, అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను, కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఏడేళ్లలో కరీంనగర్ రూపురేఖలు మారిపోయాయని, అన్ని రంగా ల్లో నగరం అభివృద్ధి చెందిందన్నారు. గతంలో చాలా ప్రభుత్వాలు వచ్చాయని, ఎమ్మెల్యేలు వచ్చారు పోయారు కానీ, అభివృద్ధి చేయాలనే మనసు వారికి రాలేదని ఎద్దేవా చేశారు. తమకు రోడ్లు కావాలంటూ, మహిళలు ధర్నా చేసిన రోజులు గుర్తున్నాయని, గతంలో రోడ్ల నిర్మాణం కోసం లక్ష రూపాయలు ఖర్చు పెట్టాలంటే ఇ బ్బంది పడాల్సిన పరిస్థితులుండేవన్నారు. కానీ, స్వయం పాలనలో వేలాది కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసి చూపిస్తున్నామన్నారు. ఇప్పుడు కరీంనగర్ రూపు రేఖలు మారాయని, ఏడేళ్లకు, ఇప్పటికీ తేడా గమనించాలన్నారు. జరుగుతున్న అభివృద్ధితో కరీంనగర్ వాసుల జీవన ప్రమాణాలు పెరిగాయని, కరీంనగర్ను విడిచి వెళ్లిన వారంతా తిరిగివస్తుండడమే ఇందుకు నిదర్శనమన్నారు.
తలాపునే మానేరు రిజర్వాయర్ ఉన్నా, తాగునీటికి ఇబ్బందులు పడ్డ రోజులు గుర్తున్నాయని, ఇప్పుడు తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. గత 40 నుంచి 50 ఏళ్లుగా పాలించిన నాయకులు నగరాన్ని అభివృద్ధి చేయడంలో నిర్లక్ష్యం చూపారని, కానీ, ఐదేళ్లలో నగర రూపురేఖలు మార్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. తెలంగాణ వ్యతిరేక శక్తులు, ఢిల్లీ పార్టీల మాటలు వింటే మనకు అధోగతే దిక్కన్నారు. ఇకడి నీరు, బొగ్గు, నిధులు, కరెంట్ దోచుకుపోయి, తెలంగాణ వాసులను బికారులు గా మార్చుతారన్నారు. వారంతా ఎన్నికల్లో ఓ ట్ల కోసమే వచ్చి అనంతరం మళ్లీ కనిపించకుం డా పోతారన్నారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడే ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్ మాత్రమేనని, ఆయనకు అండగా ఉండి మన పిల్లల భవిష్యత్తును కాపాడుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ సేవా ఇస్లావత్ డివిజన్ కార్పొరేటర్ నేతికుంట యాదయ్య,తోటరాములు, నాంపల్లి శ్రీనివాస్, కోల సంపత్ రెడ్డి, డిష్ మధు పాల్గొన్నారు.