మానకొండూర్, మార్చి 26: ఆటో డ్రైవర్ల సమస్యలపై పోరాడుతామని మాజీ ఎంపీ వినోద్కుమార్ పేర్కొన్నారు. మంగళవారం మానకొండూర్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆటో యూనియన్ నాయకులు, డ్రైవర్లతో ఏర్పాటు చేసిన సమావేశానికి వినోద్కుమార్ హాజరై మాట్లాడారు. ఆటోడ్రైవర్ల సంక్షేమానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషిచేసిందని గుర్తు చేశారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఆటో యూనియన్ నాయకులు, డ్రైవర్లు తన గెలుపునకు కృషిచేయాలని కోరారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రూప్సింగ్, రాష్ట్ర నాయకుడు గెల్లు శ్రీనివాస్, ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
గంగాధర, మార్చి 26 : గర్శకుర్తి గ్రామంలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు మంగళవారం బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేదపండితులు వినోద్కుమార్ను సన్మానించి, ఆశీర్వచనాలు అందజేశారు.
మండలంలోని ఆచంపల్లి గ్రామానికి చెందిన రుద్ర భూమయ్య ఇటీవల మృతి చెందగా బాధిత కుటుంబాన్ని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ పరామర్శించారు. భూమయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మృతికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ నాయకులు సాగి మహిపాల్రావు, మేచినేని నవీన్రావు, ఆకుల మధుసూదన్, కంకణాల విజేందర్రెడ్డి, వేముల దామోదర్, అలువాల తిరుపతి, ద్యావ మధుసూదన్రెడ్డి, రామిడి సురేందర్, సత్యనారాయణ తదితరులు ఉన్నారు.