కార్పొరేషన్, ఫిబ్రవరి 9: తెలంగాణ చిహ్నంలో మార్పులు చేస్తామని అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి మాట్లాడడం సరికాదని, తెలంగాణ చరిత్రను కనుమరుగు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మండిపడ్డారు. శుక్రవారం రాత్రి కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ చిహ్నంలో 800 ఏండ్ల చరిత్ర కలిగిన కాకతీయ తోరణం, చార్మినార్ చిహ్నాలు ఉన్నాయన్నారు. అయితే, కేబినెట్లో తీర్మా నం చేసి ఈ చిహ్నం తొలగిస్తామని, రాచరిక పోకడలకు సూచిక లెక ఉందని మాట్లాడడం పద్ధతి కాదన్నారు. తెలంగాణ ఏర్పాటైతే రాష్ట్రాన్ని పాలించడం చేతకాదని సీమాంధ్ర నేతలు అవహేళన చేసినప్పటికీ 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఏర్పాటైన రాష్ట్రం లో పదేళ్ల పాటు ఉద్యమనేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్రా న్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపారని చెప్పారు.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అశోక చక్రం ఉన్న మూడు సింహాలతో భారత ప్రభుత్వ చిహ్నం రూపొందించారని, మరి ఇది రాచరిక పాలనకు సంకేతమా? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్రెడ్డి ఇప్పటికీ సీ మాంధ్ర పాలకుల మైకంలోనే ఉన్నారనే అర్థం అవుతుందని పేరొన్నారు. సీఎం రేవంత్రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేస్తామని కూడా మాట్లాడడం దేనికి సంకేతమని నిలదీశారు. పేర్లు మార్చడం కాదు.. ప్రజలకు ఏం చేయబోతున్నారో చెప్పాలని అన్నారు. ఈ సమావేశంలో రాజన్న సిరిసిల్ల జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, గంగాధర ఎంపీపీ శ్రీరాం మధు, బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు జకుల నాగరాజుయాదవ్, ద్యావ మధుసూదన్రెడ్డి, బద్దం ప్రవీణ్ రెడ్డి, శ్రావణ్, ఓంకార్ పాల్గొన్నారు.