బోయినపల్లి, మార్చి 2: కరీంనగర్ పార్లమెంట్పై గులాబీజెండా ఎగురవేయాలని, అందుకోసం బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు కష్టపడి పనిచేయాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టి.. వారు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేసేదాకా పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. శనివారం వెంకట్రావ్పల్లిలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజా సంబంధాలు, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని తనకు చేరవేసేందుకు పార్లమెంట్ పరిధిలోని ప్రతి నియోజకవర్గంలో ఒక కార్యాలయం ఏర్పాటు చేస్తామన్నారు.
అందులో ఒక సిబ్బందిని నియమించి కంప్యూటర్, ఇతర సామగ్రిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యకర్తలు, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా కార్యాచరణ రూపకల్పన చేశామన్నారు. కార్యకర్తలందరూ ప్రజా క్షేత్రంలోకి వెళ్లి బాధితుల వెన్నంటి ఉం టూ వారి సమస్యలు పరిష్కారమయ్యే విధంగా కృషిచేయాలన్నారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ రాష్ర్టా న్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారన్నారు. తప్పుడు, అమలు కానీ హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చే వర కు ఊరుకునేదిలేదన్నారు. రెండు లక్షల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు వేయాలని డిమాండ్ చేశారు. కార్యకర్తలు, నాయకులు అధైర్యపడొద్దని కేసీఆర్ అండగా ఉన్నారన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ మం డలాధ్యక్షుడు కొండయ్య, నాయకులు పాల్గొన్నారు.