కార్పొరేషన్, జనవరి 27: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని మాజీ ఎంపీ బీ వినోద్కుమార్ బీఆర్ఎస్ నాయకులకు పిలుపునిచ్చారు. కరీంనగర్ కరీంనగర్ పార్లమెంట్ స్థానం పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లోని 40 మండలాలు, మున్సిపాలిటీల్లో పర్యటించి ప్రజలను కలువాలని దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులు, అం దిన సంక్షేమ ఫలాలను వివరించాలని సూచించారు. శనివారం నగరంలోని బీఆర్ఎస్ క్యాంపు ఆఫీసులో నియోజకవర్గానికి చెందిన పలువురు ముఖ్యనేతలతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు ఉండాల్సిన అవశ్యకతను ప్రజలకు వివరించాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్ను గెలిపిస్తే ఒరిగేదేమీ ఉండదని, ఇంటి పార్టీతోనే ఈ ప్రాంతానికి మేలు జరుగుతుందనే విషయాన్ని విడమరిచి చెప్పాలన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, తోట ఆగయ్య, ముఖ్య నాయకులు వీర్ల వెంకటేశ్వర్రావు, సిద్ధం వేణు, పొన్నం అనిల్కుమార్ గౌడ్, ఏనుగు రవీందర్రెడ్డి, జకుల నాగరాజు యాదవ్, దూలం సంపత్ గౌడ్, తిరుపతి నాయక్, పూర్ణచందర్, కేమసరం తిరుపతి, పర్శరాం, మధు, సాయికృష్ణ, సికిందర్, హరీశ్, తదితరులు పాల్గొన్నారు.