గంగాధర, జనవరి 6 : కేసీఆర్ పాలన పుష్కలంగా నీళ్లు ఇస్తే.. కాంగ్రెస్ పాలన రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నదని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మండిపడ్డారు. ఎన్నికలకు ముందు కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు కింద కేటాయించిన రూ.7700 కోట్ల నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్ల కోసం దారి మళ్లించి రైతుల నోట్లో మట్టికొట్టిందని ధ్వజమెత్తారు.
గంగాధర మండలం మధురానగర్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 122 కిలోమీటర్ల మేర వరదకాలువ విస్తరించి ఉందని, చొప్పదండి నియోజకవర్గంలో 42 కిలోమీటర్ల కాలువ ఉన్నదని, దీనిని నమ్ముకుని నియోజకవర్గంలో దాదాపు 27 వేల ఎకరాల్లో రైతుల పంటలు సాగు చేస్తున్నారని గుర్తు చేశారు.
ఎక్కడా ఇబ్బంది లేకుండా సాగునీరివ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కురిక్యాల సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిర్మల్రావు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్రావు, సర్పంచులు వేముల లావణ్యాఅంజి, కంకణాల విజేందర్రెడ్డి, వేముల దామోదర్, ఎంపీటీసీ ద్యావ మధుసూదన్రెడ్డి, నాయకులు అట్ల శేఖర్రెడ్డి, లింగాల దుర్గయ్య, దోమకొండ మల్లయ్య, పడిదపెల్లి కిషన్, గునుకొండ బాబు, గంగాధర రాజయ్య, సుంకె అనిల్, సాయిళ్ల సంతోష్, మామిడిపెల్లి అఖిల్, ద్యావ సంజీవ్, గంగాధర నగేశ్, నరేశ్, సముద్రాల ఓంకార్, పెరుక మహేశ్, తూం రవి పాల్గొన్నారు.