గంగాధర, డిసెంబర్ 4: ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని, నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. కొట్లాడి రాష్ర్టాన్ని సాధించుకున్నామని, కేసీఆర్ లేని తెలంగాణ రాష్ర్టాన్ని ఊహించుకోలేకపోతున్నానని కంటతడి పెట్టారు. ప్రాణం ఉన్నంతవరకు గులాబీ జెండాను మోస్తానని, కార్యకర్తలు అధైర్యపడొద్దని, ప్రతి కార్యకర్తనూ కంటికి రెప్పలా కాపాడుకుంటామని భరోసానిచ్చారు.
గంగాధర మండలం బూరుగుపల్లిలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2018లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానన్నారు. ఎమ్మెల్యేగా అందరికీ అందుబాటులో ఉండి పని చేశానని, కార్యకర్తలకు ఆపద వచ్చినా అండగా ఉంటానని భరోసానిచ్చారు. ఈ ఎన్నికల్లో కష్టపడి పని చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మల్యాల జడ్పీటీసీ కొండపల్కల రామ్మోహన్రావు, గంగాధర సింగిల్విండో చైర్మన్ దూలం బాలగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్రెడ్డి, మాజీ చైర్మన్లు సాగి మహిపాల్రావు,
గంట్ల వెంకట్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు మేచినేని నవీన్రావు, వెల్మ శ్రీనివాస్రెడ్డి, జనగం శ్రీనివాస్, సర్పంచులు మిట్టపెల్లి సుదర్శన్, మడ్లపెల్లి గంగాధర్, ఎండీ నజీర్, వేముల దామోదర్, జోగు లక్ష్మీరాజం, నాయకులు ఇప్పనపెల్లి సాంబయ్య, ఆకుల మధుసూదన్, రామిడి సురేందర్, వేముల అంజి, బొల్లాడి శ్రీనివాస్రెడ్డి, దూలం శంకర్గౌడ్, మడ్లపెల్లి రమేశ్, చిలుముల రమేశ్, సుంకె అనిల్, రేగుల తిరుపతి, కడపల మల్లేశం, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.