కార్పొరేషన్, డిసెంబర్ 28: కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలును వాయిదా వేసేందుకే ప్రజాపాలన పేరిట దరఖాస్తుల పక్రియకు తెరలేపిందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల వరకు ఈ తంతు నడిపిస్తారని విమర్శించారు. గురువారం కరీంనగర్లోని మాజీ మంత్రి కమలాకర్ క్యాంపు ఆఫీసులో విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు నిధులను విడుదల చేస్తే కాంగ్రె స్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి అడ్డుకున్నదని మండిపడ్డారు.
ప్రభుత్వం అధికారం చేపట్టి 20 రోజులు దాటినా ఎం దుకు రైతుబంధు నిధులు ఖాతాల్లో జమ చేయలేదని ప్రశ్నించారు. అలాగే పింఛన్లను కూడా నిలిపివేసిందన్నారు. యా సంగి పంటల సాగు సమయం గడుస్తున్నా రైతుబంధు విడుదల చేయకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా వెంటనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో అడ్డగోలుగా హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. సమావేశంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ పొన్నం అనిల్కుమార్, నాయకులు ఆరె రవిగౌడ్, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.