తిమ్మాపూర్, సెప్టెంబర్ 22: రాంలీలా వేడుకల పేరిట అధికార పార్టీ నాయకులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. తిమ్మాపూర్లోని బీఆర్ఎస్ రాష్ట్ర నేత కేతిరెడ్డి దేవేందర్రెడ్డి గెస్ట్హౌస్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించామని గుర్తుచేశారు.
కానీ, ఇప్పుడు ప్రజలు ఈ పండుగను జరుపుకోవడానికి భయపడే స్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ఇప్పుడు రాజకీయ కుట్రల బారిన పడిందని, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని మండిపడ్డారు. వేడుకల సాకుతో వసూళ్లకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. మానకొండూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఆయన అనుచరులు రామలీలా కార్యక్రమాల పేరిట రూ.1.15 కోట్లు వసూలు చేశారని ఆరోపించారు.
వీటిని సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఉపయోగించకుండా, వ్యక్తిగత ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు కేతిరెడ్డి దేవేందర్రెడ్డి, లింగాల లక్ష్మణ్, మహిపాల్రెడ్డి, నాయిని వెంకటరెడ్డి, పాశం అశోక్ రెడ్డి, మాతంగి లక్ష్మణ్, వేల్పుల మల్లయ్య, నగునూరి బాబు, మాతంగి అంజయ్య, కవ్వంపల్లి పద్మ పాల్గొన్నారు.