ఇల్లంతకుంట, మార్చి21: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో సిరులు పండించిన రైతాంగం కాంగ్రెస్ పాలనలో కన్నీ ళ్లు పెడుతున్నదని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొ న్నారు. గురువారం ఆయన పెద్దలింగాపూర్, రామోజీపేట గ్రామాల్లో పర్యటించి ఎండిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎద్దేడ్చినన ఎవుసం.. రైతేడ్చిన రాజ్యం ఎన్నడూ నిలువదన్నారు. కోతకు వచ్చే దశలో పంటలు ఎండిపోవడం తో రైతులు నష్టపోయారన్నారు. ప్రభుత్వం వెంటనే పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశా రు. సాగుపై అవగాహన లేని కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేల నిర్లక్ష్యం, అవగాహనలేకే సాగునీరందించలేదన్నారు.
బీఆర్ఎస్ పాలన లో మండుటెండల్లోనూ చెరువులు, కుంటలు అలుగులు దుంకాయని, ఒక్క ఎకరం కూడా ఎండిపోలేదని గుర్తుచేశారు. నీరందక పంట లు ఎండిపోయిన రైతులపై రాళ్ల వర్షం రూపం లో కడగండ్లు మిగిలాయన్నారు. పెట్టుబడి కూడా చేతికిరాక అప్పుల భారం పెరిగే ప్రమా దం ఉందన్నారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత సర్కారుదేనన్నారు. అనంతరం ఆయన ఇటీవల మృతిచెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇక్క డ జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, బీఆర్ఎస్ మం డలాధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి, నేతలు సుధాకర్రెడ్డి, మీసరగండ్ల అనిల్, శ్రీనివాస్, భాగ య్య, భిక్షపతి, బాలరాజు ఉన్నారు.