Ganneruvaram | గన్నేరువరం, జనవరి 29 : గన్నేరువరం మండలంలోని పారువెల్ల శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ15 వార్షికోత్సవంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ శ్రీలక్ష్మీగణపతి స్వామి వారిని గురువారం దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంప వెంకన్న, బీఆర్ఎస్ నాయకులు సిద్ధం వేణు, మహిళల అధ్యక్షురాలు నవీన, నాయకులు తీగలమోహన్ రెడ్డి, పీచు మహేందర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.