ఇల్లంతకుంట, ఫిబ్రవరి 2: కేసీఆర్ పాలనలో నిర్మించిన అన్నపూర్ణ ప్రాజెక్టును ఎడారిగా మార్చొద్దని, శ్రీ రాజరాజేశ్వర జలాశయం నీటిని వారంలోగా విడుదల చేయాలని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ డిమాండ్ చేశారు. విద్యుత్, సాగునీటి కొరతతో రైతుల పంటపొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వారం లోగా అన్నపూర్ణ ప్రాజెక్టుకు జలకళ తీసుకురావాలని, లేకుంటే అన్నదాతలతో కలిసి ఆందోళ న చేస్తామని హెచ్చరించారు.
శుక్రవారం ఆయన అనంతగిరి, తిప్పాపూర్, పెద్దలింగాపూర్, సిరికొండ గ్రామాల శివారులో ఎండిన వరి పంటలను రైతుల తో కలిసి పరిశీలించి, మాట్లాడారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కఠోరశ్రమతో కాళేశ్వరం ప్రా జెక్టు నిర్మించారన్నారు. పదేండ్లుగా అన్నపూర్ణ ప్రాజె క్టు పరిసర ప్రాంతాలు పచ్చని పంట పొలాలతో కళకళలాడాయని చెప్పారు.
ప్రస్తుతం కాంగ్రెస్హయాం లో శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి దిగువకు నీటిని తీసుకెళ్తున్నారని, పక్కనే ఉన్న అన్నపూర్ణ ప్రా జెక్టును మాత్రం పట్టించుకోవడంలేదని మండిపడ్డా రు. ప్రాజెక్టు నిర్మాణానికి అనంతగిరి గ్రామస్తులు స ర్వం కోల్పోయారని, నేడు వారికే సాగునీటి ఇబ్బందులు కలిగించడం సరికాదన్నారు. ఆయన వెంట జ డ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, సెస్ డైరెక్టర్ రవీందర్రె డ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి, ఎంపీటీసీ పరశురాం, ఉప సర్పంచ్ బాలకిషన్, నా యకులు ముత్తారెడ్డి, రమణారెడ్డి, అనిల్, బొప్ప శ్రీనివాస్, బాబు, సంతోష్రెడ్డి పాల్గొన్నారు.