Kalvasrirampur | కాల్వశ్రీరాంపూర్, జూలై 17 : రైతులు ఆరుతడి పంటల్లో భాగంగా ఆయిల్ పామ్ పంట సాగుపై దృష్టి సారించాలని పెద్దపల్లి జిల్లా ఉధ్యానవన శాఖ అధికారి గడ్డం శ్యాం ప్రసాద్ అన్నారు. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి లో గోపగోని రంజిత్ వ్యవసాయ భూమిలో పట్టు, ఉధ్యానవన శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఆయిల్ పామ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో శ్యాంప్రసాద్ మాట్లాడారు. 2026-27 సంవత్సరానికి మండలంలో ఇప్పటి వరకు 60 ఎకరాల్లో ఆయిల్ఫాం మొక్కలు నాటినట్లు తెలిపారు. మరో 50 ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలు నాటే లక్ష్యంగా రైతులు ముందుకురావడం సంతోషంగా ఉందన్నారు.
రంజిత్ ను ఆదర్శంగా తీసుకొని మిగతా రైతులు ఆయిల్ పామ్ నాటేందుకు ముందుకు రావాలని కోరారు. ఆయిల్ పామ్ పంట దీర్ఘకాలికంగా స్థిరమైన ఆదాయాన్ని అందించే లాభదాయరకమైన పంట అని చెప్పారు. అనంతరం అదే గ్రామంలో విజయవంతంగా సాగవుతున్న ఆయిల్ పామ్ తోటలను పరిశీలిచారు. ఎరువుల యాజమాన్యం, తెగుళ్లు, నీటి నిర్వహణ, పోషకాహార లోపాలపై సంకేతిక సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అరెల్లి రమేశ్, ఉద్యానవన అధికారులు మహేశ్, రాము, ఏవో సంధ్య, ఏఈవో ఈశ్వర్ రెడ్డి, సతీశ్, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్, ఏఎంసీ చైర్మన్ తిరుపతిరెడ్డి, ఫీల్డ్ ఆఫీసర్స్ అజయ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.