Chigurumamidi | చిగురుమామిడి, ఫిబ్రవరి 28 : చిగురుమామిడి మండలంలోని పలు రైతువేదికలు మందుబాబులకు అడ్డాగా మారాయి. గ్రామానికి దూరంగా ఉండడంతో మందుబాబులు ఇష్టారాజ్యంగా రాత్రివేళలో మద్యం సేవిస్తూ రైతువేదికల వద్ద మద్యం సీసాలను పగలగొడుతూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి, నవాబుపేట, ముదిమాణిక్యం రైతు వేదికలు ఊరికి దూరంగా ఉండడంతో రాత్రివేళలో మందుబాబులు మద్యం సీసాలు తాగి వెళ్తున్నారు. ఉదయం రైతు వేదికలకు వచ్చే వ్యవసాయ విస్తరణ అధికారులకు తలనొప్పిగా మారింది. రైతు వేదికల బయట మద్యం సీసాలు, రైతు వేదిక లోపల పాములు, తేళ్లతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఏఈవోలు అఖిల, సాయికుమార్, ప్రణయ్ ఆవేదన వ్యక్తం చేశారు.