గంగాధర,జనవరి 26: ఏదేని కారణాలతో మరణించిన రైతు కుటుంబాలకు రైతుబీమా పథకం భరోసానిస్తుందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. మండలంలోని ఒద్యారం గ్రామాని కి చెందిన బొడ్డు వెంకటయ్య, పండగు భాగ్యలక్ష్మి అనే రైతులు ఇటీవల మృతి చెందారు. వీరు గతంలో రైతుబీమాకు దరఖాస్తు చేసుకోగా వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం మంజూరైంది. కాగా, గురువారం ఎమ్మెల్యే రవిశంకర్ మృతుల కుటుంబాల ఇండ్లకు వెళ్లి బీమా మంజూరు పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీలకతీతంగా పథకాలు వర్తింపజేస్తున్న ఘనత ఈ సర్కారుకే దక్కిం దన్నారు. కాగా.
రైతుబీమాతో తమను ఆదుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్, ఇందు కు సహకరించిన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్కు రైతుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. రైతుబీమా మం జూరైన పండుగ భాగ్యలక్ష్మి కొడుకు గగన్కుమార్ జనసేన ఉమ్మడి జిల్లా యూత్ ఎగ్జిక్యూటీవ్ మెం బర్. కార్యక్రమంలో సర్పంచ్ ములుకుంట్ల సంప త్, ఎంపీటీసీ కోలపురం లక్ష్మణ్, ఉపసర్పంచ్ మ్యాక సుజాత వెంకటస్వామి, నాయకులు సలువాజి విద్యాసాగర్రావు, ములుకుంట్ల శ్రీకాంత్, గొల్లపల్లి నవీన్, సాయిచరణ్, తేల్ల శివ, ముటుకుంట్ల వెంకటస్వామి, రాచకొండ సునీల్, ములుకుంట్ల టింకు, కవ్వంపెల్లి వెంకటేశ్ పాల్గొన్నారు.